Miss India : ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆడపిల్లలు కేవలం కొన్ని రంగాలలో ఎంతో అభివృద్ధిని సాధించి వారి సత్తాచాటుకున్నారు. కానీ ప్రస్తుతం ఫ్యాషన్ రంగంలో కూడా తమ సత్తా చాటుకుంటున్నారు. ఈ ఫ్యాషన్ ప్రపంచంలోకి ఎంతోమంది గొప్పవాళ్లు వస్తుంటారు. అయితే వాళ్లందరి ముందు నిలబడి నేడు మిస్ ఇండియా టైటిల్ ని ఒక తెలుగింటి ఆడపిల్ల సొంతం చేసుకున్నారు.ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో హైదరాబాద్కు చెందిన మానస వారణాసి విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా మానస వారణాసి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
హైదరాబాద్ కి చెందిన మానస చిన్నప్పటి విద్యాభ్యాసం మొత్తం గ్లోబల్ ఇండియన్ స్కూల్ లో పూర్తి చేశారు. అయితే తనకు ఆర్థిక రంగంపై ఎంతో ఆసక్తి ఉండటం వల్ల మానస వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో ఎకనామిక్స్ లో పట్టభద్రులయ్యారు.ఆమె ప్రస్తుతం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. చిన్నప్పుడు ఎంతో మొహమాటంగా ఇతరులతో మాట్లాడటానికి కూడా ఎంతో ఇబ్బంది పడే మానస తన స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడం కోసం తన దృష్టిని భరతనాట్యం వైపు మళ్ళించారు.ఇంజనీరింగ్ కాలేజీలో చదివేటప్పటికి కూడా ఫ్యాషన్ రంగం పై ఎలాంటి అవగాహన లేకపోయినప్పటికీ కళాశాలలో మొదటిసారిగా ర్యాంప్ వాక్ నడిచి బహుమతి గెలుచుకున్నారు.
తన జీవితంలో ఈ ముగ్గురు ఎంతో ప్రత్యేకం:
ఈ విధంగా బహుమతులు గెల్చుకోవడంతో 21 సంవత్సరంలో తనకి మోడలింగ్ పై ఆసక్తి కలిగిందని ఓ సందర్భంలో తెలియజేశారు. ప్రస్తుతం మానస ఈ స్థాయిలో ఉన్నారంటే అందుకు గల కారణం తన సోదరి, తన అమ్మ, బామ్మ ముగ్గురు కారణమని ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. వీరి ప్రోత్సాహం వల్లనే ప్రస్తుతం తను ఫ్యాషన్ రంగంలో రాణించాగలగానని తెలిపారు.2014 జూన్ 13 నుంచి మానస ఇన్స్టాలో ఖాతాను ప్రారంభించారు. సాధారణంగా సోషల్మీడియాలో తక్కువగా కనిపించే మానస సమయానికి అనుగుణంగా ఫోటోలను షేర్ చేసే వారు.
మోడలింగ్ పై అవగాహన, ఆసక్తి రావడంతో తన శరీర ఫిట్ నెస్ పై శ్రద్ధ తీసుకున్నారు. ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిని త్రాగటంతో తన దినచర్యను ప్రారంభించేవారు. ఎప్పుడైనా మానసికంగా ఆందోళన చెందుతున్నపుడు, అధిక ఒత్తిడికి లోనైనప్పుడు తన దృష్టిని మొత్తం సంగీతం వైపు మళ్ళించేదని తెలిపారు. అదేవిధంగా హీరోయిన్ ప్రియాంక చోప్రా అంటే తనకెంతో ఇష్టమని తనే రోల్ మోడల్ అంటూ ఈ ఫెమినా మిస్ ఇండియా తెలియజేశారు.