హీరోలుగా, నిర్మాతలుగా దగ్గుబాటి వారసులు ఆల్రెడీ తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిలిచారు. తమ నటనతో టాలెంట్ తో అభిమానులకు చేరువయ్యారు. విక్టరీ వెంకటేష్ నుంచి రానా వరకు ప్రతి ఒక్కరూ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. సురేష్ బాబు కూడా తనదైన శైలిలో చిన్న, పెద్ద సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ ప్రేక్షకులకు చేరువయ్యారు. దగ్గుబాటి రామానాయుడు కుమారులుగా సురేష్ బాబు, వెంకటేష్ ఎలాగైతే ఇండస్ట్రీలో రాణిస్తున్నారో ప్రజెంట్ సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి రానా కూడా అదే స్థాయిలో క్రేజ్ ను సంపాదించుకున్నాడు.
ఇక బాహుబలి మూవీ తర్వాత రానా క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. పాన్ ఇండియన్ స్టార్ స్థాయికి చేరుకున్నారు రానా. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు అటు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతున్నాడు రానా. అయితే సురేష్ బాబు చిన్న కొడుకు ఇండస్ట్రీకి ఎప్పుడు అడుగుపెడతాడా.. అంటూ దగ్గుబాటి ఫాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. దీంతో ప్రజెంట్ సిచువేషన్ చూస్తుంటే ఆ టైం రానే వచ్చింది అని అర్థమైపోతోంది. దగ్గుబాటి అభిరాం ని హీరోగా ఇంట్రడ్యూస్ చేయడానికి సురేష్ బాబు ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్.
గతంలో కొన్ని కారణాల వల్ల సోషల్ మీడియాలో వివాదాస్పదంగా నిలిచి అభిరామ్ ఇమేజ్ కి కొంత డ్యామేజ్ అయ్యింది. ఆ సమయంలోనే హీరోగా లాంచ్ చేద్దామనుకున్నారు. కానీ సిచువేష న్ బ్యాడ్ గా ఉండటం తో డ్రాపయ్యారు. కాగా మళ్లీ ఆ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఒకేసారి పెద్ద భారీ చిత్రాల్లో హీరోగా పరిచయం చేయడం కాకుండా… ముందు పెళ్లిచూపులు లాంటి క్లాస్ అండ్ సింపుల్ మూవీతో ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అందుకే అభిరామ్ లాంచింగ్ ప్రాజెక్ట్ కి తరుణ్ భాస్కర్ ని సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్ తో ప్రత్యేక అనుబంధం ఉన్న తరుణ్ భాస్కర్ లేటెస్ట్ కి గా అభిరాం ను లాంచ్ చేసే బాధ్యత అప్పగించినట్టు సమాచారం. ఈ విషయంలో క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఎఫ్ 3 తర్వాత వెంకటేష్ తో తరుణ్ భాస్కర్ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.