టాలీవుడ్ కింగ్ నాగార్జున తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫోర్ కి హోస్ట్ గా చేసిన సంగతి తెలిసిందే. సీజన్ త్రీ కి కూడా హోస్ట్ గా చేయడం జరిగింది. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ లను పరిస్థితి పరంగా సరైన రీతిలో డీల్ చేస్తూ నవ్విచాలిసిన సమయంలో నవ్విస్తూ, మంచి చెప్పాల్సిన సమయంలో మంచి చెబుతూ, పొగడాల్సిన సమయంలో పొగుడుతూ, సరిదిద్దాల్సిన సమయంలో సరిదిద్దుతూ నాగార్జున చేసే యాంకరింగ్ అదరహో అని చెప్పాల్సిందే.
వీకెండ్ ఎపిసోడ్ కి నాగార్జున వస్తున్నారు అంటే చాలు ప్రత్యేకంగా ఆయన ఎపిసోడ్ చూడటానికి చాలామంది ఎగబడతారు. అంతలా తన యాంకరింగ్ ద్వారా బిగ్ బాస్ ఆడియన్స్ ని నాగార్జున బాగా ఆకట్టుకోవడం జరిగింది. ఇటువంటి తరుణంలో సీజన్ ఫోర్ కి హోస్ట్ గా చేసినందుకు భారీస్థాయిలో నాగార్జున రెమ్యునరేషన్ అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బయట కనబడుతున్న వార్తల ప్రకారం దాదాపు ఏడు కోట్లు సీజన్ ఫోర్ కి హోస్ట్ గా చేసినందుకు నాగార్జున పారితోషికం తీసుకున్నట్లు టాక్. ఈ సీజన్ మొత్తానికి 30 ఎపిసోడ్లకు డీల్ కుదుర్చుకున్న నాగార్జున దసరా సమయంలో తన బదులు కోడలు సమంతతో యాంకరింగ్ చేయించడం జరిగింది. ఆ సమయంలో వైల్డ్ కార్డ్ షూటింగ్ కారణంగా రెండు వారాలు హాజరుకాలేదు. అయితే రెండు వారాలకు సంబంధం లేకుండా షో నిర్వాహకులు కింగ్ నాగ్ కి రూ. 7 కోట్లు ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.