ప్రభాస్ త్వరలో సలార్ సినిమా తో న్యూ ఇయర్ లో సెట్స్ మీదకి రాబోతున్నాడు. ఈ విషయాన్ని అధికారకంగా కూడా పకటించారు. ప్రస్తుతం ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వాస్తవంగా ఈ సినిమా తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కాని అనూహ్యంగా సలార్ సెట్స్ మీదకి రాబోతున్నట్టు మేకర్స్ వెల్లడించారు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సలార్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న సంగతి తెల్సిందే. ఈ సినిమాలో దగ్గుబాటి రానా, మోహన్లాల్ కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
కాగా సలార్ జనవరి నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతుండగా ఇంతలోనే ఆదిపురుష్ షూటింగ్ మొదలైంది అని లేటెస్ట్ అప్డేట్ వచ్చి షాకిచ్చింది. అవును తాజాగా దర్శకుడు ఓం రౌత్ ఆది పురుష్ సినిమా షూటింగ్ ని ప్రభాస్ లేకుండా సెట్స్ మీదకి తీసుకు వచ్చాడు. రామాయణం ఇతివృత్తంగా ఓం రౌత్ ఆదుపురుష్ ని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ సీన్స్ షాట్స్ ఎక్కువగా ఉండటంతో ఆదిపురుష్ కు సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ ను దర్శకుడు స్టార్ట్ చేసేశాడని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన రెండు ప్రముఖ వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఆదిపురుష్ కోసం ఇప్పటికే పనులు మొదలు పెట్టాయని తాజా సమాచారం.
అయితే లైవ్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ దాదాపు సంవత్సారినికి పైగానే వీఎఫ్ఎక్స్ చేయాల్సి ఉంటుందట. అందుకే ముందు ఈ వర్క్ నే ఓం రౌత్ మొదలు పెట్టాడట. ఇక ప్రభాస్ సహా మిగతా ఆర్టిస్టులందరూ పాల్గొనే సీన్స్ కి కేవలం 3 నెలలు మాత్రమే పడుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ని 2022 లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏదేమైనా ప్రభాస్ లేకుండా కూడా ఆదిపురుష్ షూటింగ్ మొదలవడం ఫ్యాన్స్ కి సర్ప్రైజింగ్ గా ఉందట.