ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పును ఏకగ్రీవంగా ప్రకటించేశారు. ఎంతో మంది టీడీపీ ఎమ్మెల్యేలు చాలా ముఖ్యమైన స్థానాల్లో నిలబడి కూడా చివరికి అడ్రస్ లేకుండా ఓడిపోయారు. ఇక ఏళ్ల తరబడి ఎమ్మెల్యేలుగా చేసిన నియోజకవర్గాల్లో కూడా తమ పదవిని నిలుపుకోవడానికి నానా పాట్లు పడ్డారు. అలా ఓడిపోయిన టిడిపి మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు వైసీపీకి క్యూ కడుతున్న విషయం తెలిసిందే.
ఇక ఈ ప్రక్రియ వైసిపి కి లాభమా లేదా నష్టమా అన్న విశ్లేషణ ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే వారి నియోజకవర్గాల్లో ఇప్పుడు ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల చేత దారుణంగా ఓడిపోయి ఒక మూలన కూర్చున్న వారిని జగన్ ఎటువంటి మొహమాటం లేకుండా వైసీపీలోకి చేర్చుకుంటున్నారు. జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి రాజమండ్రిలో చందన రమేష్ వైజాగ్ లో రమేష్ బాబు ఇలా అందరూ వైసీపీలో చేరుతుంటే ఉన్న వైసిపి నాయకులు భవిత్యం, ఎమ్మెల్యేల ఉనికి, టికెట్ కోసం పార్టీ కోసం సేవ చేస్తున్న నాయకుల పరిస్థితి ఏమిటి అన్నది పెద్ద సందేహంగా మారింది.మరో వైపు తమ పరపతిని ఉపయోగించి టిడిపి మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పుల్లలు పెడుతూ…. కాంట్రాక్టర్లు పనులు దక్కించుకుంటూ వైసీపీ ఎమ్మెల్యేలను తొక్కేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఎంత పాత సామాన్లు అయినా కూడా వీరికి ఉన్న బలంతో గిరాకి మాత్రం బాగా అవుతోంది. దీంతో వైసిపి క్షేత్రస్థాయి నేతల్లో నిరసన వ్యక్తమవుతోంది. కష్టపడి పవర్ దక్కించుకున్న తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా టిడిపి మాజీ ఎమ్మెల్యేలకు ఉండడంతో వైసిపి లోని ఒక వర్గం లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చేసిందన్న రిపోర్టులు వచ్చేశాయి.
ఇక విశ్లేషకులు మాట ఏమిటంటే టిడిపి మాజీ ఎమ్మెల్యేలు వైసీపీకి బలం చేకూర్చడం కంటే బలహీనత గా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. పార్టీ నష్టపోతుందే తప్పించి వీరి వల్ల ఏం లాభం లేదన్నది వారి మాట. ఎన్నికలు అయిపోయిన తర్వాత వారి వల్ల వల్ల లక్ష కోట్లు వచ్చినా ఏం లాభం అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల వరకు నాయకులపై.. దాని తర్వాత పూర్తిగా పార్టీ నిర్ణయాల మీద, వ్యవహారాల మీద రాబోయే రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది అన్నది వారి వాదన. ఇక ఎంతోమంది మాజీ ఎమ్మెల్యే లను పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతున్న వైసిపి వారు… త్వరలో రానున్న ముప్పుని చూడలేకపోతున్నారా?