వర్షకాలం నుంచి శీతాకాలంలోకి ప్రవేశిస్తున్నాము. సీజనల్ వ్యాధులు ప్రబలే కాలం ఇది. జలుబు, దగ్గు, ఫ్లూ సాధారణం. అయితే ఈ కరోనా కాలంలో వాటిని నిర్లక్ష్యం చేయడం తగదంటున్నారు వైద్య నిపుణులు. అందుకే ఈ వ్యాధుల బారిన పడకుండా కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇంటి వైద్యాన్ని సూచించింది. ఆ సూచనలు మీ కోసం…
సీజనల్ పండ్లు:
ఏ కాలంలో లభించే పండ్లు ముఖ్యంగా సీతాఫలాలు, రేగు పళ్ళు, నారింజ, దానిమ్మ వంటి పళ్ళను ఎక్కువగా తీసుకోవాలి. ఈ కాలం లో ఉసిరి కాయలు ఎక్కువగా తీసుకోవటం వలన కఫ గుణాలను తగ్గిస్తుంది. వీటిని పచ్చడిగానో, కారంగానో ఏదోకవిధంగా తినే అన్నంలో మొదటి ముద్దగా తీసుకోవాలి. త్రిఫల చూర్ణంను ఉదయం లేదా సాయంత్రం మజ్జిగతో తీసుకోవాలి.
కషాయాలు:
ఈ కాలంలో గోరువెచ్చని నీటిని ఎక్కువగా తీసుకోవాలి. హెర్బల్ టీ , అల్లం, ధనియాలు,ఆమ్ల కాషాయాలు తీసుకోవాలి. వేడి పాలలో పసుపు కలిసి తీసుకోవడం వలన జలుబు నుంచి ఉపశమనం ఉంటుంది.నీలగిరి ఆకూ, పసుపు, కర్పూరం వేసి ఆవిరి పడితే కఫ సమస్యలు తగ్గుతాయి. వగరు వంటి పదార్ధాలను ఆహారంలో భాగం చేసుకోవాలి.
పరిశుభ్రత:
ఈ కాలంలో ఎక్కువగా దోమలు గుడ్లు పెడుతుంటాయి. ఇంటి మూలలను చుటుపక్కలా ఎప్పటికపుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దుప్పట్లు వారానికి రెండు సార్లు ఉతుక్కోవాలి.మ్యూకస్,సైనస్, సైనాటిసిస్ వలన ఆస్తమా టి.బి సమస్యలు వస్తాయి
ధూపం:
ఇంట్లో ప్రతినిత్యం ధూపం వేసుకోవాలి.ఆవుపేడతో ధూపం వేసుకోవడం వలన సైంటిఫిక్ ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో నెయ్యి వేసి ధూపం వేస్తే కళ్ళకు మంచిది.ఇందులో కర్పూరం వేసి వేస్తె ఉపిరితిత్తులకు సమస్యలు తగ్గుతాయి.
ఈ కాలంలో చర్మం పొడిబారే అవకాశం ఎక్కువ.కాబట్టి ఆవనూనె, నువ్వుల నూనెతో మర్దన చేసుకోవాలి. దానిమ్మను తీసుకోవటం వలన రక్తాన్ని చేస్తుంది.సీజనల్ ఫ్రూప్ట్స్ అన్ని తీసుకుంటూ తగు జాగ్రత్తలు పాటించాలి.