దుబ్బాక ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు నరాలు తేగే ఉత్కంఠను రేపుతోంది. 12వ రౌండ్ నుండి 19వ రౌండ్ వరకూ టీఆర్ఎస్ కారు దూసుకువెళ్లగా 20,21 రౌండ్లలో బీజేపీకి అధిక్యత వచ్చింది. 21 రౌండ్ పూర్తి అయ్యే సరికి బీజేపీ అభ్యర్థి రఘునందనరావు.. టిఆర్ఎస్ అభ్యర్థి సుజాతపై 620 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు.
టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థి మద్య నువ్వా నేనా అన్న రీతిలో ఓట్ల లెక్కింపు ఉత్కంఠతను కల్గిస్తుంది. చేగుంట, నార్సింగి మండలాలకు చెందిన ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. మరో రెండు రౌండ్లు జరగాల్సిన ఓట్ల లెక్కింపు సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠభరితంగా సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతోంది.
దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 3వ తేదీన జరిగిన పోలింగ్లో మొత్తం 1,64,192 ఓట్లు పోల్ అయ్యాయి.