NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి మరణంపై సీబీఐ విచారణ జరపాలంటూ విజయసాయి, లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

ఏపిలో వైసీపీ వర్సెస్ టీడీపీ గా సాగుతున్న రాజకీయంలో ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య వ్యవహారం కూడా చేరింది. హైదరాబాద్ లో అనుమానాస్పద స్థితిలో కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకోగా ఆమె ఆత్మహత్యకు కారణాలు ఏమిటంటూ తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. ఈ అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబానికి ఆపాదిస్తూ వైసీపీ సోషల్ మీడియా ఆరోపణలు, విమర్శలు చేస్తుండగా మానవత్వం అనేది లేకుండా వైసీపీ ప్రవర్తిస్తోందంటూ టీడీపీ ప్రతి విమర్శలు చేస్తొంది. అయితే ఈ అంశంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా , ఆ పార్టీ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార్వతి మీడియా సమావేశంలో సంచలన కామెంట్స్ చేస్తూ ఉమామహేశ్వరి మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.

 

“ఉమామహేశ్వరి మరణంపై అనుమాలున్నాయి. మా చంద్రన్న వేధించాడా? లేదా ఇంకెవరైనా చంపి ఉరివేశారా? ఎన్టీఆర్ కూతురు బేలగా ఆత్మహత్య చేసుకుందంటే ఎవరూ నమ్మడం లేదు. సీబీఐI దర్యాప్తు కోరి నిజం నిజం నిగ్గు తేల్చాలి బాబన్నా”  అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. “అప్పట్లో కోడెలది గుండెపోటు అన్నారు. తర్వాత ఉరి వేసుకున్నారని చెప్పారు. ఆయన మొబైల్ మాయం చేశారు. ఉమామహేశ్వరి గారిదీ సహజ మరణమని నమ్మించాలని చూశారు. చంద్రబాబుకు దగ్గరివాళ్లే ఎందుకిలా అర్ధాంతరంగా చనిపోతున్నారు?” అని విజయసాయి ప్రశ్నించారు. “వైఎస్ గారి మరణంపై అవమానకరంగా మాట్లాడారు. జగన్ గారిపై హత్యాయత్నం చేయించి కోడి కత్తి అంటూ హేళన చేశారు. బరితెగించినోళ్లకి చంపడం, సుపారీ హత్యలు చేయించడం ఒక లెక్కా?”  అన్నారు విజయసాయిరెడ్డి. “మరణించాక ఎన్టీఆర్‌ శవాన్ని లాక్కున్నారు! కోడెల శివప్రసాద్ కంటే ముందుగా ఆయన సెల్‌ ఫోన్‌కు అంత్యక్రియలు చేశారు! ఇప్పుడు…పప్పుగాడి పిన్ని గారు –చున్నీతో ఉరి వేసుకుందంటున్నారు! ఏం క్రిమినల్స్‌ ఫ్యామిలీరా బాబూ మీది! ” అంటూ విజయసాయి ఆరోపణలు విమర్శలను సంధించారు.

 

వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఇదే అంశంపై చంద్రబాబుపై విమర్శలు సంధించారు. ఉమామహేశ్వరి ఆత్మహత్యపై సీబీఐ దర్యాప్తు జరగాలన్నారు. ఆమె బలవన్మరణానికి చంద్రబాబే కారణమని అనుమానం ఉంది కాబట్టి సీబీఐ దర్యాప్తు కోరుతూ చంద్రబాబు లేఖ రాయాలని లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. చంద్రబాబు లేఖ రాయకపోతే తానే స్వయంగా లేఖ రాస్తానని చెప్పారు. ఉమామహేశ్వరి ఎంతో ధైర్యవంతురాలు, విద్యావంతురాలనీ, ఆత్మహత్య చేసుకునే పిరికితనం ఎన్టీఆర్‌ కుటుంబంలో లేదని అన్నారు లక్ష్మీపార్వతి. ఆస్తి కోసం, చంద్రబాబు, లోకేష్‌ ఆమెతో గొడవ పడుతున్నారట అని వ్యాఖ్యానించారు. ఆ ఒత్తిడి భరించలేకే ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుందన్న ప్రచారం జరుగుతోందనీ, ఆమె సూసైడ్‌ లెటర్‌ మాయం కావడంతో మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయన్నారు లక్ష్మీపార్వతి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju