ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను, బయట ప్రపంచానికి తెలియని సంగతులను, వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకున్న అనుబంధాన్ని, ఆయనతో ఉన్న జ్ఞాపకాలను ఇలా అన్నిటినీ పుస్తక రూపం ఇచ్చారు వైఎస్ విజయలక్ష్మి.
ఈ పుస్తకానికి నాలో, నాతో వైఎస్సార్ అని పేరు పెట్టారు విజయమ్మ. రేపు వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. నాటి ముఖ్యమంత్రి బయోగ్రఫీను ఆయన భార్య రాయడం, ఆయన కొడుకైన నేటి ముఖ్యమంత్రి ఆవిష్కరించడం చాలా అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రపంచానికి వైఎస్సార్ అంటే ఏంటో తెలుసు. ఆయన గురించి తెలియని విషయాలు ఎన్నో ఇందులో ఉన్నాయన్నారు విజయమ్మ.