YSRCP: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఇన్ చార్జిల మార్పులు, చేర్పులు చేస్తున్న క్రమంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అశావహులు అసంతృప్తిని వ్యక్తం చేయడం, కొందరు బాహాటంగానే పార్టీపై విమర్శలు చేయడం లాంటివి జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో పలు పార్లమెంట్ నియోజకవర్గాలకు రీజినల్ కోఆర్డినేటర్ లను వైసీపీ నియమించింది. పార్టీ అధినేత, సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్ గా విజయసాయి రెడ్డి, ఒంగోలు పార్లమెంట్, ఉమ్మడి నెల్లూరు రీజనల్ కోఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కరరెడ్డి నియమితులైయ్యారు.
కర్నూలు, నంద్యాల పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్ గా పి రామసుబ్బారెడ్డి, కడప, రాజంపేట పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్ గా కే సురేష్ బాబు, ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటి రీజనల్ కోఆర్డినేటర్ గా గుడివాడ అమరనాథ్, విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడుగా మల్లాది విష్ణు ను నియమిస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది.
Pawan Kalyan: ఏపీలో పొత్తులపై పవన్ కళ్యాణ్ ప్రకటన .. పార్టీ శ్రేణులకు కీలక సూచన