వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో మాయని మచ్చ ఏదైనా ఉందంటే అతని పై ఆరోపించబడిన మరియు అతనిని జైలుకు పంపించి ఇంకా కోర్టులో నడుస్తున్న అవినీతి కేసులే. ఇక అనూహ్య రీతిలో ఊహించని స్థాయిలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్ ను దెబ్బ కొట్టేందుకు ఇంతకన్నా మంచి ఆయుధం టిడిపికి దొరకదు. కానీ జగన్ పాలన మొదలు పెట్టిన సంవత్సరం అవుతున్నా ఈ అవినీతి అంశంపై టార్గెట్ చేసేందుకు టిడిపికి పెద్దగా ఛాన్సులు రాలేదు అనే చెప్పాలి. దాంతో నిట్టూర్పు సెగలతో నీరసించిపోయి ఉన్న వారికి ఊపు తెస్తూ ఈ చెన్నై ఉదంతం చోటుచేసుకుంది.
ఇటీవల ఆంధ్ర తమిళనాడు బోర్డర్ లో ఐదు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు ఒక కారులో తమిళనాడు పోలీసులకు చిక్కింది. ఆ కారు పై ఒంగోలు ఎమ్మెల్యే మరియు వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి బొమ్మ ఉంది. అయితే నాకు ఆ కార్ కి ఏమీ సంబంధం లేదని బాలినేని వాదిస్తున్నా టిడిపి వారు మాత్రం వైసిపి వారు ఆ డబ్బు హవాలా లో చెన్నై నుండి మారిషస్ కు పంపే ప్రణాళికలో భాగంగా దొరికిపోయారు అని తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ దెబ్బతో ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వైసిపి ఎలా డబ్బు దోచుకుని విదేశాలకు తరలిస్తోందో బట్టబయలు అయిపోయింది అంటూ విపరీతంగా ఏకిపారేశారు.
హవాలా, మనీలాండరింగ్, సూట్ కేసు కంపెనీలు,పేరు ఏదైనా ప్రజా ధనం దోపిడీ లో @ysjagan రూటే సేపరేటు!#JGangChennaiHawala pic.twitter.com/NRTiit3s6O
— Lokesh Nara (@naralokesh) July 18, 2020
ఇక ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ విషయానికి వస్తే… ఆయన ఇంకొక అడుగు ముందుకు వేసి అతను చెన్నైలో జగన్ అతి ఖరీదైన ‘భవనం’ నిర్మిస్తున్నారని ఈ క్రమం లోనే కొన్ని సామాన్లను ఎక్కడికి తరలించారని ఆ సామాన్లు వెనుక ఇంకెన్ని ‘చీకటి వ్యవహారాలు’ ఉన్నాయో అని అనుమానం వ్యక్తం చేస్తూ ట్వీట్ల పైన ట్వీట్లు వేస్తున్నారు.
హవాలాకు కేంద్రంగా ఉన్న వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ సంస్థ రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన ఇ-మెయిల్ అడ్రస్ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిది. పైగా ఈ సంస్థను వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019 సెప్టెంబర్ 20న రిజిస్టర్ చేసారు. అంటే అది సూట్ కేసు సంస్థ అన్నట్టే కదా (3/4)#JGangChennaiHawala
— Lokesh Nara (@naralokesh) July 18, 2020
అంతేకాకుండా ఫారెక్స్ ఇంపెక్స్, క్వన్నా ఎగ్జిం, వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లకు వైఎస్ కుటుంబానికి చెందిన వైఎస్ భారతీ రెడ్డి, వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి డైరెక్టర్లు గా వ్యవహరిస్తున్నారని మరియు ఈ హవాలా కేంద్రంగా ఉన్న వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్ సంస్థ రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన ఈ మెయిల్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మెయిల్ అని ఆయన బయట పెట్టారు.
ఏపీలో కొల్లగొట్టిన కోట్ల కొద్దీ నల్లధనాన్ని వైసీపీ నేతలు ఎమ్మెల్యే స్టిక్కర్లు అంటించిన కార్లలో చెన్నైకి చేరవేస్తున్నారన్నది బయటపడింది. ఇలా వెళ్తున్న డబ్బు ఎవరిది? ఆ డబ్బు చెన్నై నుంచి హవాలా మార్గంలో మారిషస్ కు వెళ్ళేది నిజమేనా? ఇవిప్పుడు తేలాలి (1/4)#JGangChennaiHawala pic.twitter.com/eqyxAjGXtP
— Lokesh Nara (@naralokesh) July 18, 2020
ఇవన్నీ వైసిపి సూట్కేస్ కంపెనీలు అని.. వీటి ద్వారా మరియు డబ్బుని అక్రమంగా పంపిస్తున్నారని లోకేష్ చెప్పడం గమనార్హం. ఇదే విషయాలపై రోజుకొక ట్వీట్ వేసి వైసీపీ ని చావు దెబ్బ తీస్తున్న లోకేష్ ఇంకా ఏమేమి బయటపెడతారో అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా టిడిపి నేతలు మరియు కేడర్ అంతా ఈ పరిణామాలతో పండగ చేసుకుంటున్నారు అనే చెప్పాలి.