ఏపీ సీఎం జగన్ గత పార్టీల మాదిరిగా కాకుండా బీసీలకు పెద్ద పీట వేస్తూ అనేక మంత్రి పదవులు కట్టబెట్టడమే కాక బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిపక్షంలోనే బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదని బ్యాక్ బోన్ గా గుర్తిస్తా అని మాట ఇచ్చిన జగన్, సీఎం అయ్యాక బీసీ వర్గాలకు మేలు చేస్తూ 139 కులాలను 56 కార్పొరేషన్ల గొడుగు కిందకి తీసుకురావడం జరిగింది.
ఈ క్రమంలో కార్పొరేషన్ల పాలక మండలిని కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఏర్పాటైనా కార్పోరేషన్ల చైర్మన్ల, డైరెక్టర్ల పదవి ప్రమాణ స్వీకారం భారీ బీసీ బహిరంగ సభగా నిర్వహించడానికి జగన్ సర్కార్ రెడీ అయింది. ఈ క్రమంలో ఈ నెల 11 వ తారీకు నాడు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సాయంత్రం మూడు గంటలకు నిర్వహించడానికి నిర్ణయించారు. ఈ సభకు “బిసి సంక్రాంతి” అని పేరు పెట్టారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో బీసీ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణస్వీకారోత్సవం చాలా ఘనంగా జరగనుంది. ఈ బీసీ సంక్రాంతి బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, వేణుగోపాల్ పరిశీలించారు. దాదాపు పదివేల మంది ఈ సభలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సభను నిర్వహిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చాలావరకు బీసీ వర్గాల లో వైసీపీ పార్టీ పై ఉన్న కొద్ది నమ్మకం కలగటమే కాక ప్రభుత్వ పరంగా అనేక మేలులు అనుభవించినట్లు బీసీ వర్గాలలో చర్చ నడుస్తుంది. ముఖ్యంగా గతంలో ఉన్న ఇతర పార్టీలు తమని ఓటుబ్యాంకు కింద మాత్రమే చూడటం జరిగిందని, కాని జగన్ వచ్చాక సరైన న్యాయం అన్ని విధాల జరుగుతుందని బీసీ వర్గాలు జగన్ పాలన పై అనుకుంటున్నట్లు మీడియా సర్కిళ్లలో వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా వచ్చే ఏడాదిలో రాబోతున్న సంక్రాంతి పండుగ వాతావరణాన్ని వైయస్ జగన్ సర్కార్ ముందే బీసీలకు అందించనున్నట్లు తాజా బహిరంగ సభ బట్టి తెలుస్తోంది.