ఇటీవల కుండపోత వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంట నష్టపోవడంతో రైతులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పరామర్శించడం తెలిసిందే. ఈ సందర్భంగా లోకేష్ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పంట నష్టపరిహారాన్ని అంచనా వ్యయాన్ని ముఖం చాటేస్తున్నారు అనే రీతిలో లోకేష్ కామెంటు చేయడం జరిగింది. కాగా ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ ఇదే ప్రశ్నను వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి మంత్రి కన్నబాబు సమాధానం చెబుతూ..వర్షాలు పడిన తర్వాత లోకేష్ కామెడీ షో గత వారం రోజుల నుండి చూడలేక పోతున్నాము అంటూ ఎటకారంగా విమర్శలు చేశారు.
బహుశా రాజకీయాల్లోకి వచ్చాక లోకేష్ ఫస్ట్ టైం ఇలా వరదల్లోకి వర్షాలు పడిన తరువాత ప్రజల్లోకి రావటం, పెద్దపెద్ద స్టేట్మెంట్ లు ఇవ్వటం బట్టి చూస్తే ఆయన ఏదో ఎంజాయ్ చేసినట్లు కనబడుతుంది అని పేర్కొన్నారు. ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే ఎనిమిది నెలల నుంచి తండ్రి కొడుకు ఇద్దరూ కూడా కరోనాకు భయపడి హైదరాబాదులో దాక్కున్నారు. కేవలం రాష్ట్రంలో అమరావతి సమస్య గురించి తప్ప ఏ రైతు సమస్య గురించి కూడా ఎప్పుడు ఇద్దరూ బయటకు రాలేదు.
చంద్రబాబు దృష్టిలో రైతుల అంటే కేవలం అమరావతి, అది కూడా అమరావతి లో భూములు ఇచ్చిన పెద్ద రైతులు. వారి కోసం పోరాటం తప్ప ఏరోజైనా…రాష్ట్రంలో మిగతా రైతుల కోసం పోరాటం చేశారా ఆయన అని కన్నబాబు మీడియా సముఖంగా ప్రశ్నించారు. అలాంటిది ఈ రోజు బయటకు వచ్చి పెద్ద పెద్ద డైలాగులు వేయటం ఆశ్చర్యంగా ఉంది అన్నట్టుగా కన్నబాబు లోకేష్ పర్యటన పై సెటైర్లు వేశారు. ఎవరు కూడా వర్షాల ని, వరదలని ఆపలేరని…అది ఎవరికి కూడా సాధ్యం కాదు అని తెలిపారు. జరిగిన నష్టానికి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నాలు స్టార్ట్ చేసింది అని క్లారిటీ ఇచ్చారు