ESI స్కామ్ లో అరెస్టు అయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కేసులో రెండు నెలలు కావస్తున్నా ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు ఏదీ రుజువు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. 2 నెలల క్రితం అచ్చెన్నాయుడు ఆరోగ్యం బాగో పోయినా గాని హుటాహుటిన అరెస్టు చేసి పోలీసులు నానా హడావిడి చేశారు. అయితే అవినీతి జరిగింది అంటున్న ఏసీబీ ఇప్పటి వరకు అచ్చెన్నాయుడు పై ఎటువంటి చార్జిషీట్ వెయ్యలేదు అని కొన్ని మీడియా చానల్స్ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. స్కామ్ జరిగి ఉంటే కచ్చితంగా అవినీతి ఉంటది, తవ్వేకొద్ది బయటపడుతుంది.
అచ్చెన్నాయుడు ని ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టు చేసి రెండు నెలలు అయినా అతనితో పాటు 12 మందిని విచారించిన ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఏసీబీ అధికారులు అవినీతి జరిగినట్లు నిరూపించలేదు. దీంతో ఈ కేసులో అసలు ఉద్దేశం పోలీసుల అది వేరే అనే భావన ప్రస్తుతం ప్రజలలో కలుగుతుంది అన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇస్కాన్ గురించి మొదటి నుండి వార్తలు వస్తున్న తరుణంలో అచ్చెన్నాయుడు అన్ని ప్రభుత్వ నిబంధనలకు మేరకు మాత్రమే వివరించినట్లు ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని గతంలోనే చెప్పుకొచ్చారు.
ఇదే విషయాన్ని ఏసీబీ అధికారులు కూడా తెలిపారు. మరి అలాంటప్పుడు అవినీతి చేసాడని అచ్చెన్నాయుడు జైల్లో ఉండటం బయట బెయిలు రాకపోవడం దేనికి సంకేతం అని ప్రజలు చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా అచ్చెన్నాయుడు స్వతహాగా ఎవరిపైనా తాను ఒత్తిడి చేసిన సందర్భాలు కూడా లేవని అంత ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే వ్యవహరించినట్లు తెలిపారు. దీంతో ప్రస్తుతం వైసిపి సోషల్ మీడియా అయితే ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు A1 అని విమర్శలు స్టార్ట్ చేశారు.
దీంతో మరి ఒక్క రూపాయి కూడా అవినీతి చేయకుండా అచ్చెన్నాయుడు జైల్లో పెట్టడం ఏంటి అనేది ప్రజలలో నెలకొన్న ప్రశ్న. ప్రభుత్వం ఒత్తిడి మేరకే ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడు ని ఒక ఉద్దేశపూర్వకంగా అరెస్టు చేసినట్లు ప్రజలు భావిస్తున్నట్లు సమాచారం. మొత్తంమీద చూసుకుంటే అచ్చెన్నాయుడు కేసు అటు తిరిగి ఇటు తిరిగి జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది.