BJP : బెంగాల్ రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బిజెపికి మధ్య పోటాపోటీ నువ్వా నేనా అన్నట్టు గా ఉన్నట్లు సర్వేల ఫలితాలు తెలియజేస్తున్నాయి. మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికలలో సత్తా చాటడంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో కూడా సత్తా చాటాలని బెంగాల్ లో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీకి చెందిన కీలక నాయకులు.. భారీ స్థాయిలో వ్యూహాలు వేస్తూ ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులను బీజేపీలోకి జాయిన్ చేసుకోవడం జరిగింది. మరోపక్క దాదాపు పది సంవత్సరాల నుండి అధికారంలో మమతా బెనర్జీ ఉండటంతో ఈసారి కచ్చితంగా ఓటమి తప్పదని చాలామంది విశ్లేషిస్తున్నారు.
ఇలాంటి తరుణంలో ఒపీనియన్ పోల్స్ లో బిజెపి పార్టీ గ్యారెంటీగా అధికారంలోకి వస్తుందని ఫలితాలు రావడంతో బెంగాల్ బీజేపీ శ్రేణులు మరింత దూకుడు పెంచారు. మేటర్ లోకి వెళితే ఇటీవల పీపరల్స్ పల్స్ ఒపీనియన్ పోల్స్ అనే సర్వే సంస్థ నిర్వహించిన పోల్స్ లో..జరగబోయే బిజెపి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 183 స్థానాలు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 93, వామపక్షాల కూటమికి16 స్థానాలు వస్తాయని ఫలితాలు వచ్చాయి.
మరోపక్క సి ఓటర్” ఒపీనియన్ పోల్స్ లో కూడా బీజేపీకి 160, తృణమూల్ కాంగ్రెస్ కి 112, వామపక్షాల పార్టీకి 12 స్థానాలు వస్తున్నట్లు ఫలితాలు రావడంతో ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా బిజెపి వైపు ప్రజలు చూస్తున్నట్లు ఫలితాలు వస్తున్న నేపథ్యంలో బెంగాల్ బీజేపీ నేతలు మంచి దూకుడుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. పరిస్థితి ఇలా ఉండగా ఎన్నికలలో ఓటర్లను ప్రలోభపెట్టే రీతిలో డబ్బులు పంచడానికి బిజెపి నాయకులు వ్యవహరిస్తున్నారని అటువంటి వారిని పట్టిస్తే .. ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాను అంటూ తాజాగా మమతా బెనర్జీ బెంగాల్ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు.