ఉన్న కొద్ది వేడెక్కుతున్నాయి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికలలో గెలవడంతో గ్రేటర్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ బీజేపీ. ఇదిలా ఉంటే మొన్నటి వరకూ ఎవరితోనూ పొత్తులు ఉండవు, పొత్తు పెట్టుకోడానికి ఎవరూ మమ్మల్ని సంప్రదించలేదు అంటూ కామెంట్లు చేసినా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, జనసేన తో పొత్తు పెట్టుకోవడానికి ఆరాటపడుతున్నారు. ఇందుకోసం బండి సంజయ్ పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నట్లు సమాచారం. జిహెచ్ఎంసి ఎన్నికలలో కలసి పనిచేసే అవకాశాలపై బండి సంజయ్ పవన్ తో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఎలాగైనా గ్రేటర్ ఎన్నికలలో గెలిస్తే తెలంగాణలో బిజెపికి ఎదురు ఉండదని పార్టీ క్యాడర్ భావిస్తున్న నేపథ్యంలో ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగుతోంది. వరదలు విషయములో టిఆర్ఎస్ ప్రభుత్వం పై భారీ స్థాయిలో నగర ప్రజల నుంచి విమర్శలు రావడంతో… ఇదే సరైన సమయం టిఆర్ఎస్ ని దెబ్బ కొట్టాలి అని బిజెపి క్యాడర్ భావిస్తోంది. బండి సంజయ్ అధ్యక్షతన ఇప్పటికే నగరంలో ఉన్న బీజేపీ క్యాడర్ గ్రేటర్ ఎన్నికలలో ఏ విధంగా ముందుకు సాగాలో పక్కా వ్యూహాలను సిద్ధం చేసుకోవడం జరిగింది.
ఇలాంటి నేపథ్యంలో జరగబోయే ఎన్నికలలో పొత్తు విషయంలో క్లారిటీ వచ్చాక.. బండి సంజయ్ 150 డివిజన్లలో పర్యటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ తో బండి సంజయ్ బేటీ అవుతున్నట్లు, పొత్తు కన్ఫామ్ ఐతే పవన్ కళ్యాణ్ కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో పలుచోట్ల ప్రచారానికి రానున్నట్లు తెలంగాణ రాజకీయ వర్గాలలో టాక్.