జూన్ 15వ తారీఖున భారత్ మరియు చైనా సరిహద్దుల మధ్య వివాదం చోటు చేసుకుని చైనా ఆర్మీ మన దేశానికి చెందిన 20 మంది సైనికులను చంపటం మనకందరికీ తెలిసిందే. అదే ఘటనలో మన దేశాన్ని కి చెందిన సైనికులు కూడా చైనా దేశానికి చెందిన సైనికులను వంద మందికి పైగా చంపటం జరిగింది. జరిగిన ఈ దుర్ఘటన తో ఇండియాలో చైనా దేశం పై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజన్లు చైనా వస్తువుల పై నిషేధం విధించాలంటూ చైనా వస్తువులు కొనకూడదు అంటూ భారీ స్థాయిలో ప్రచారం చేశారు.
అదే రీతిలో కేంద్ర ప్రభుత్వం కూడా చైనా దేశానికి చెందిన యాప్స్ పై నిషేధం విధిస్తూ మొదటిలో 53 యాప్లను దేశంలో లేకుండా చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఇటీవల చైనా కి చెందిన మరికొన్ని యాప్ లపై భారత ప్రభుత్వం నిషేధం విధించడం జరిగింది. ఈ విధంగా తమ దేశానికి చెందిన యాప్ లపై భారత్ నిషేధం విధించడంతో అదే రీతిలో ఇండియా కి షాక్ ఇచ్చింది డ్రాగన్ కంట్రీ. పూర్తి మ్యాటర్ లోకి వెళ్తే భారత్ లో సేవలు అందిస్తున్న చైనీస్ మొబైల్ బ్రాండ్ హువాయి సంస్థ ఏకంగా 60-70 శాతం ఉద్యోగులను భారత్లో తొలగించాలని సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ టార్గెట్ సగానికిపైగా తగ్గించుకోవడంతో చైనా దేశానికి చెందిన హువాయి సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో చాలామంది హువాయి సంస్థలో పనిచేసే భారతీయులు ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. మరోపక్క ఇండియాలో చైనా వస్తువులకు గిరాకీ లేకపోవటంతో హువాయి మొబైల్స్ ని ఎవరు కొనటం లేదని అందువల్లే ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.