తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉంది. అలాగే రోజు రోజుకి నమోదవుతున్న కొత్త పాజిటివ్ కేసులు మరియు మరణాల విషయంలో కూడా మహారాష్ట్ర మాదిరిగా తెలంగాణ తయారవటానికి దగ్గర్లో రోజులు ఉన్నాయని వైద్యనిపుణులు పరిస్థితులు బట్టి వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకు కరోనా ఎక్కువ సోకుతున్న తరుణంలో ఈ – ఆఫీస్ విధానాన్ని అమలు చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ ఆఫీస్ వ్యవస్థ ద్వారా కరోనా కంట్రోల్ అయ్యే వరకు పాలన కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం ప్రైవేటు కంపెనీలు మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగస్తులు అధికారులు కూడా ‘వర్క్ ఫ్రామ్ హోమ్’ చేయించడానికి ఈ – ఆఫీస్ పాలనా వ్యవస్థను అమలు చేయబోతున్నారు. ముందుగా రాష్ట్రంలో సచివాలయంలో ఆ తర్వాత ఇతర జిల్లాలలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలలో ఈ విధానాన్ని అమలు చేయాలని టిఆర్ఎస్ ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇందుకు అవసరమైన సాప్ట్ వేర్ ను తయారు చేస్తున్నారు. అలాగే డేటాను పూర్తిగా సిద్దం చేసుకోవడం, డిజిటల్ సంతకాలు సేకరణ మొదలైనవి చేయ సంకల్పించారు. ఇందుకోసం ప్రతి శాఖకు ఒక నోడల్ అదికారి సాంకేతిక సహాయకుడుగా కేసీఆర్ సర్కార్ నియమించడానికి రెడీ అవుతోంది.