టిఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఎప్పటినుండో కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కేసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి రాష్ట్ర బాధ్యతలు మొత్తం అంతా కొడుకు కేటీఆర్ చేతిలోపెట్టి పట్టాభిషేకం చేయబోతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల లోపు దేశవ్యాప్తంగా చాలా పార్టీలను కలుపుకొని ముందుకు పోతున్నట్లు కూడా కరోనా లాక్డౌన్ సమయంలో కేసిఆర్ ఓ మీడియా సమావేశంలో తెలియజేయడం జరిగింది.
ఇదిలా ఉండగా కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఇటీవల తెలంగాణ నూతన ముఖ్యమంత్రి కేటీఆర్ కి వెల్కమ్ అంటే ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ కామెంట్లు చేయడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. 2018 ముందస్తు ఎన్నికల లో టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మహాకూటమి లో జాయిన్ అయినా సీపీఐ తాజాగా మాత్రం ప్రభుత్వం పై పోరాడే విషయంలో నేరుగా కాకుండా ఎప్పటికప్పుడు లెటర్లు రాస్తూ రాజకీయం చేస్తుంది. ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని పెద్దగా విమర్శించడం లేదు.
అయితే మాటిమాటికీ ఇటీవల సిపిఐ కేటీఆర్ ని పొగుడుతూ ఉండటంతోపాటు ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసి కెసిఆర్ ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని సలహాలు ఇస్తూ వస్తోంది. మరోపక్క టిఆర్ఎస్ పార్టీలో ఉన్న క్యాబినెట్ కూడా ఖచ్చితంగా త్వరలో కేటీఆర్ సీఎం పదవి చేపట్టడం గ్యారెంటీ అన్న లీకులు ఇస్తూ ప్రచారాలు కల్పిస్తోంది. ఇదే తరుణంలో కేటీఆర్ కూడా ముఖ్యమంత్రి చేయాల్సిన చాలా పనులు ఇటీవల కరోనా సమయంలో అదేవిధంగా వరదలు వచ్చిన క్రమంలో తానే దగ్గరుండి చూసుకుంటున్నారు.
ప్రభుత్వంలో అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజలకు మరింత దగ్గరవుతూ కేటీఆర్ ఇటీవల వ్యవహరిస్తున్నారు. దీంతో దాదాపు టిఆర్ఎస్ పార్టీ వర్గాలలో కేటీఆర్ కి ఆల్మోస్ట్ సీఎం పదవి కేసీఆర్ ఇచ్చినట్లే అని భావిస్తున్నట్లు టాక్. పరిస్థితి ఇదిలా ఉండగా 2024 సార్వత్రిక ఎన్నికలలో కేసీఆర్ జాతీయ స్థాయిలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి సరైన స్కెచ్ వేసినట్లు దక్షిణాది రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. సౌత్ సెంటిమెంట్ తోనే కేసిఆర్ కేంద్రంలో ఉన్న బిజెపి ని ఎదుర్కోబోతున్నట్లు సమాచారం.