ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య ఆడియో టేప్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. జడ్జి రామకృష్ణతో ఆయన సంభాషణలు అనంతరం పరిణామాలు తెలిసిన సంగతే.
ఇందుకు సంబంధించిన ఆడియో టేప్ను వైరల్ అవడం, ఈ వ్యవహారంపై ఈశ్వరయ్య ఎట్టకేలకు స్పందించి మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చిన ఉదంతం తెలిసిందే. అయితే, తదనంతర పరిణామాల్లో హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేయడం మరింత సంచలనంగా మారింది.
మాజీ జడ్జి ఈశ్వరయ్య కేసులో హైకోర్టు స్పందన ఏంటనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమైన సంగతి తెలిసిందే. రిటైర్డ్ న్యాయమూర్తి ఈశ్వరయ్య కేసులపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణకు హైకోర్టు ఆదేశాలు వెలువరించింది. విచారణ అధికారిగా మాజీ న్యాయమూర్తి ఆర్.వి.రవీంద్రన్ను నియమించింది. రవీంద్రన్కు సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ అధికారులు సహకరించాలని హైకోర్టు ఆదేశాలు వెలువరించింది. ఈ కేసుల వెనుక ఉన్న కుట్రను చేధించాలని హైకోర్టు ఆదేశించింది. 4 వారాల్లో నివేదికను అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉండగా జడ్జి రామకృష్ణ చేసిన ఆరోపణలను ప్రకంపనలు సృష్టించాయి. ఈ వ్యవహారం కోర్టు దాకా వెళ్లడంతో గురువారం హైకోర్టు ధర్మాసనం సంచలన ఆదేశాలు జారీ చేసింది. దీంతో రిటైర్డ్ జడ్జీ, మరో జడ్జీ ఫోన్ సంభాషణల ఉదంతంతో సంబంధం లేకుండానే ఏపీ ప్రభుత్వం ఇబ్బందుల పాలవుతోంది. మరోవైపు, రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్యతో ప్రభుత్వం రాజీనామా చేయిస్తుందా? అనే చర్చ తెరమీదకు వస్తోంది.