తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జంటనగరాలలో 25 బస్తీ దవాఖానాలను శుక్రవారం ప్రారంభించబోతున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ మంత్రులు మరియు ప్రభుత్వ విప్ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదేరీతిలో డిప్యూటీ మేయర్ తదితరులు వీటిని ప్రారంభించడానికి రెడీ అయినట్టు స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారని, అందుకనుగుణంగా ప్రభుత్వ వైద్య రంగాన్ని రాష్ట్రంలో బలోపేతం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా కరోనా వైరస్ ఎఫెక్ట్ తో దవాఖానాలు క్లోజ్ అయిన సమయంలో విమర్శలు వచ్చాయి. దీంతో పాటు ప్రభుత్వం సరిగా స్పందించలేదని ఆరోపణలు రావడంతో, తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నడుస్తున్న 170 బస్తి దావఖానలకు అదనపుగా 25 ఓపెన్ చేయడానికి ప్రభుత్వం రెడీ అయ్యింది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ లక్షల్లో డబ్బులు సామాన్యుడి దగ్గర పిండుకోవటంతో…. మరోవైపు విపక్షాలు నుండి విమర్శలు స్టార్ట్ అయ్యాయి. దీంతో వరుసగా అన్నివైపులా బస్తీ దావాఖనలా విషయంలో విమర్శలు రావడంతో ఎట్టకేలకు స్పందించి …. హైదరాబాదులో కొత్తగా 25 దవాఖానాలు ప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.