2019 సార్వత్రిక ఎన్నికలలో జగన్ పార్టీకి సినిమా ఇండస్ట్రీ నుండి మద్దతు తెలిపిన వారిలో ఒకరు కమెడియన్ ఆలీ. ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఆలీ చాలావరకు సినిమా ఇండస్ట్రీలో తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతారని జనసేన పార్టీలో చేరుతారని భావించారు. కానీ ఎప్పుడైతే ఆలీ జగన్ కి జై కొట్టడో సినిమా ఇండస్ట్రీలో చాలామంది షాక్ తిన్నారు. ఇదిలా ఉండగా మామూలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా వరకు టీడీపీకి మద్దతు ఉంటారు. టీడీపీకి అండగా ఉండే సామాజిక వర్గానికి చెందిన వాళ్లే టాలీవుడ్ ఇండస్ట్రీ ని ఏలుతారు అన్న టాక్ కూడా ఉంది.
పరిస్థితి ఇలా ఉండగా 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మైనారిటీలు ఉండే చోట్ల కమెడియన్ ఆలీ తనదైన శైలిలో వైసిపికి మద్దతు తెలుపుతూ వచ్చారు. అందరూ అనుకున్నట్టుగానే జగన్ భారీ మెజార్టీతో సీఎం అయినా కానీ అలీకి పార్టీ నుండి పదవి రాకపోవటం అనేకమందికి కన్ఫ్యూజన్ కి గురిచేసింది. కాగా దాదాపు 16 నెలల తర్వాత వైయస్ జగన్ ని ఇటీవల ఆలీ నీ కలవడం జరిగింది. ఇద్దరి మధ్య దాదాపు అరగంట పాటు చర్చలు జరిగినట్లు కూడా టాక్ వచ్చింది. దీంతో ఆలీకి పదవి గ్యారెంటీ అని అందరూ భావించారు.
కానీ తాజాగా జగన్ ని ఆలీ కలవటం వెనకాల అతిపెద్ద కారణమని ఒకటి వైరల్ అవుతుంది. అదేమిటంటే వైసిపికి మద్దతు తెలపడంతో ఇండస్ట్రీలో కొంత మంది కావాలని ఆలీకి అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నట్లు, ఇదే విషయాన్ని జగన్ దృష్టికి ఆలీ తీసుకొచ్చినట్లు టాక్. ఈ నేపథ్యంలో తన విజయానికి కృషి చేసిన ఆలీకి అండగా ఉంటానని భయపడాల్సిన అవసరం లేదని త్వరలోనే పార్టీ నుండి కూడా భరోసా వస్తుందని జగన్ హామీ ఇచ్చినట్లు ఏపీ రాజకీయాల్లో వినబడుతున్న టాక్.