NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

అదిగదిగో అక్టోబర్…! జగన్ ని ఊరిస్తున్న నెల..!

Ap cm ys jagan

 

సీఎం జగన్మోహన్ రెడ్డికి అక్టోబర్ నెల అత్యంత ప్రతిష్టాత్మకంగా మారుతుంది. ఇప్పటి వరకు తాను కలలు గన్న రాజధాని తరలింపు, తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల పట్టాల పంపిణీ ఈ రెండు కూడా అక్టోబర్ నెలలోనే జరిగే అవకాశం కనిపిస్తోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి మదిలో అక్టోబర్, అక్టోబర్ అంటూ మెదులుతోంది. ఎందుకు? విషయం ఏమిటి అనేది ఆరా తీసుకుంటే..

Ap cm ys jagan
Ap cm ys jagan

 

రాజధాని శంకుస్థాపన అక్టోబర్ లోనే

విశాఖలో రాజధాని శంకుస్థాపన ఈ నెల 16వ తేదీ అని అనుకున్నారు. కానీ అధికారికంగా ఖరారు చేయలేదు. రాజధాని తరలింపునకు సంబంధించి ఏపీ హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇవ్వడం, 14వ తేదీ ఆ కేసు వాయిదా కావడం, హైకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ను ఆశ్రయించినా అది విచారణ దశకు రాకపోవడం, కోర్టు తీర్పు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో దీనిపై ఆలోచించారు. కోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. దీనితో 16వ తేదీ శంకుస్థాపన ముహూర్తం ఖరారు చేయడం కష్టమని భావిస్తున్నారు. ఆగస్టు 16వ తేదీ తరువాత ముహుర్తాలు అంతగా బాగోలేనందున అక్టోబర్ లో మంచి ముహుర్తాలు ఉన్నట్లు చెబుతున్నారు. అక్టోబర్ రెండవ వారంలో రాజధాని శంకుస్థాపన ఉంటుందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి మోడీ ని ఆహ్వానించాలని సీఎం వై ఎస్ జగన్ అనుకుంటున్నారట. ఈ లోపుగా జగన్ ఢిల్లీ వెళ్లి నేరుగా ప్రధాని మోడీని కలిసి ఆహ్వానించనున్నారు.

ఇళ్ల పట్టాల పంపిణీ కూడా అప్పుడే

సీఎం వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా వాయిదా పడుతూ వస్తున్నది. నిజానికి ఇళ్ల పట్టాల పంపిణీ ఈ ఏడాది మార్చి 15వ తేదీ అనుకున్నారు. తరువాత ఉగాది అనుకున్నారు. అవ్వలేదు, మే నెల అనుకున్నారు, కుదరలేదు. జూన్ నెల అనుకున్నారు. సాధ్యం కాలేదు. ఆగస్టు 15న అనుకుంటున్నారు అది అయ్యేదిగా లేదు. తొలుత ఎన్నికల కోడ్, తరువాత పలు చోట్ల వివాదాలు, కోర్టు కేసులు, ఈ తరుణంలో కరోనా కేసులు విపరీతంగా పెరగడం తదితర కారణాల వల్ల ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడుతూ వచ్చింది. పలు నియోజకవర్గాలలో భూ సేకరణకు సంబందించి అవినీతి ఆరోపణలు రావడం, వివాదాలు జరుగుతుండటంతో అక్టోబర్ నాటికి ఈ వివాదాలు అన్నీ పరిష్కరించాలన్న భావనలో అధికార యంత్రాంగం ఉంది. అక్టోబర్ రెండున ఇళ్ల పట్టాల పంపిణీ ఖచ్చితంగా నిర్వహించాలన్న భావనతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కీలకమైన రాజధాని శంకుస్థాపన, ఇళ్ల పట్టాల పంపిణీ రెండు కార్యక్రమాలు అక్టోబర్ నెలలో జరిగే అవకాశం ఉండటంతో జగన్ కు ఆ నెల ఇంపార్టెంట్ గా మారింది.

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?