ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో శిరోముండనం జరిగిన దళిత యువకుడు రాష్ట్రపతికి తాను నక్సలైట్ గా మారాలని అనుకుంటున్నట్లు లేఖ రాయడం జరిగింది. దీంతో ఈ లేఖ జాతీయ రాజకీయాలలో మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన దళిత యువకుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసుల చేత వేధించారని శిరోముండనం చేయించినట్లు మొన్నటివరకు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం భాధ్యులైన వారిపై చర్యలు కూడా చేపట్టడం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా కావాలని ఈ విషయంలో మాజీ ఎంపీ హర్షకుమార్ శిరోముండనం జరిగిన దళిత యువకుడు చేత లెటర్ రాయించి రాష్ట్రపతికి పంపించినట్లు మాల కార్పొరేషన్ చైర్మన్ పేదపాటి అమ్మాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే రీతిలో మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు మాదిగ హర్ష కుమార్ మరియు చంద్రబాబు మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇద్దరూ కలిసి దళితులను రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులు హర్షకుమార్ కూడా జాయిన్ అయినట్లు ఆయన స్క్రిప్టు మేరకు హర్ష కుమార్ వ్యవహరిస్తున్నట్లు కనకారావు మాదిగ ఆరోపించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు కాళ్లు పట్టుకున్న హర్షకుమార్…. దళితుల గురించి పోరాటం చేస్తాం అంటే నమ్మే వారు ఎవరూ లేరంటూ తెలిపారు.
అంతేకాకుండా దళితులపై దాడి చేసిన పార్టీ టిడిపి అంటూ వీరేశ్ అయ్యారు. రాష్ట్రపతికి శిరోముండనం జరిగిన ప్రసాద్ అనే దళితుడు లెటర్ వెనకాల చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించారు. అంతేకాకుండా రాజధాని ప్రాంతంలో దళితుల భూములను చంద్రబాబు అన్యాయంగా రాకుంటే ఎందుకు ప్రశ్నించలేదని కనకారావు మాదిగ ప్రశ్నించారు. వైయస్ జగన్ దళిత పక్షపాతి వారి సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.