విశాఖపట్టణం మాజీ ఎంపీ సబ్బం హరి ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ డిబేట్ లో పాల్గొని విశాఖపట్టణం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విశాఖ లో రాజధాని ఏర్పాటు విషయంలో ప్రజా బ్యాలెట్ పెట్టాలని సూచించారు. అంతేకాకుండా విశాఖపట్టణానికి ముందు రాజధాని తీసుకురాకుండా కరోనా ని ఏపీ ప్రభుత్వం తెస్తున్నట్లు ఇక్కడ ప్రజలు భయాందోళన చెందుతున్నారు అని సబ్బంహరి అన్నారు. విశాఖ నావెల్ బేస్, అదే రీతిలో ఘాజి తన హయాంలో తానే తీసుకు వచ్చినట్లు షాకింగ్ కామెంట్లు చేశారు. తర్వాత సబ్ మెరైన్ తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు.
విశాఖపట్టణానికి రాజధాని వద్దని ఈ ప్రాంతంలో ఉన్న 62 శాతం ప్రజలు గగ్గోలు పెడుతున్నట్లు సదరు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో సబ్బం హరి కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. మొత్తం క్యాపిటల్ రాదు, ఒక సెక్రటరియేట్ మాత్రమే వస్తుంది అన్న భావనతో దీనికి విశాఖపట్టణం అనవసరమని విశాఖ వాసులు అన్నట్లు సబ్బంహరి తెలియజేశారు. విశాఖపట్టణానికి రాజధాని రాకుండా తనతో పాటు 62 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రావటంతో సబ్బంహరి పబ్బం గడుపుకుంటున్నారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సబ్బం హరి పుట్టింది 1952 సంవత్సరంలో, విశాఖ పట్టణానికి నేవీ వచ్చింది 1968వ సంవత్సరంలో. అంటే అప్పుడు సబ్బంహరి టెన్త్ క్లాసు చదువుతుంటాడు… ఆ టైం కి నిక్కర్ నుండి ఫాంట్ వేసుకునే రోజులకు నేవీ తాను తీసుకొచ్చినట్లు గొప్పలు చెప్పటం విడ్డూరమని పేర్కొంటున్నారు. అదే రీతిలో ఘాజి విషయంలో కూడా సబ్బం హరి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, కేవలం రాజకీయాల్లో పబ్బం గడుపు కోడానికి… ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నట్లు నెటిజన్లు రకరకాలుగా ఆయన పై సెటైర్లు వేస్తున్నారు.