శ్రీకాకుళం జిల్లా టెక్కలి లో అమానుషం చోటుచేసుకుంది. ఈ కరోనా కష్టకాలంలో మనకి ముందుంది ఆ వైరస్ ను ఎదిరించేది డాక్టర్లు ,పారిశుద్ధ్య కార్మికులు మరియు పోలీసులు అన్న విషయం తెలిసిందే. అయితే వైరస్ సోకి చనిపోయినవారి మృతదేహాలను ఎలాంటి గతి పడుతుంది అన్నది మనం గత కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నాం.
ఇక పోతే అపోహలను లెక్క చేయకుండా శ్రీకాకుళం జిల్లాలో ఒక కరోనా మృతునికి పారిశుద్ధ కార్మికులు ఎంతో ధైర్యంగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ అంత్యక్రియలు జరిపించారు. ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికులను స్థానికులు కాలనీ లోనికి రాకుండా అడ్డుపడ్డారు.
వారివల్ల తమకు కూడా కరోనా వచ్చే అవకాశం ఉందని భావించిన ఆ స్థానికులపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులను కాలనీ లోనికి రానివ్వకుండా ఆడ్డుకున్న 10 మంది పై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయడం గమనార్హం