అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. రిపబ్లికన్ పార్టీ నుండి డోనాల్డ్ ట్రంప్… డెమోక్రటిక్ పార్టీ నుండి జో బిడెన్ ఇద్దరు ఎవరికివారు దూసుకుపోతున్నారు. కాగా ప్రస్తుతం దేశంలో జరిగిన పొల్ సర్వేల ప్రకారం… ఇద్దరూ నువ్వానేనా అన్నట్టుగా పోటీలో ఉన్నట్లు ఫలితాలు వస్తున్నాయట. అమెరికాలో కీలక రాష్ట్రాలలో బైడెన్ కి మద్దతు ఎక్కువగా ఉండగా… మరికొన్ని చోట్ల డోనాల్డ్ ట్రంప్ కి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారట. ముఖ్యంగా బైడైన్ కమ్యూనిస్టు భావజాలం కలిగిన వ్యక్తి అని… అతను అధికారంలోకి వస్తే అమెరికా అతలాకుతలం గ్యారెంటీ అని రిపబ్లికన్లు తెగ ప్రచారం చేస్తున్నారట.
మరోపక్క డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులు మాత్రం… అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో కరోనా వైరస్ ఎదుర్కొనే విషయంలో పూర్తిగా విఫలమయ్యారని… మహమ్మారిని అడ్డంపెట్టుకుని ట్రంపు పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అట. మొత్తం మీద బయటపడుతున్న సర్వేల ప్రకారం డోనాల్డ్ ట్రంప్ అదేవిధంగా బైడైన్ ఇద్దరి మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుగా ఉందట.
ఇదిలా ఉండగా అమెరికాలో నవంబర్ మూడవ తారీఖు జరగబోయే ఎన్నికలలో ఆ రోజు ఓటు వేయడం కుదరని వారికి ముందునుండే ఓటు హక్కును వినియోగించుకోవడనికి ఏర్లి ఓటింగ్ అందుబాటులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యూఎస్ ఎలక్షన్ ప్రాజెక్టు ప్రకారం ఇప్పటివరకు అమెరికా వ్యాప్తంగా 3.5 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారట. ఈ విధంగా అయితే నవంబర్ 3వ తేదీన క్యూ లేకుండా చూడొచ్చని అక్కడి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.