2019 ఎన్నికల ఫలితాల దెబ్బకి చాలా నియోజకవర్గాలలో టిడిపి పార్టీకి ఇన్చార్జి లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కిందిస్థాయి క్యాడర్ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కి తమ బాధలు అనేక రీతులుగా గతంలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు తమ పై దాడికి పాల్పడిన గాని నియోజకవర్గ ఇన్చార్జిల నుండి ఎటువంటి స్పందన లేదని అనేక కంప్లైంట్లు చంద్రబాబు దగ్గరికి వెళ్లినట్లు కూడా వార్తలు వచ్చాయి.
దీంతో చంద్రబాబు చాలా నియోజకవర్గాలలో పార్టీ బాధ్యత పదవులను కొత్తవారికి కట్టబెట్టడానికి రెడీ అయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో… పదవి తీసుకునేందుకు చాలామంది నాయకులు పెద్దగా ఆసక్తి చూపటం లేదని టాక్ వస్తోంది. అన్ని చోట్ల పరిస్థితి ఎలా ఉందో తెలియదు గాని గుంటూరులో మాత్రం పార్టీ ఎలాంటి పదవి ఇచ్చినా దాన్ని తీసుకోవడానికి ఒకరితో ఒకరు తెలుగు తమ్ముళ్ళు తెగ పోటీ పడుతున్నారట.
ముఖ్యంగా గుంటూరు జిల్లాలో…. గుంటూరు, బాపట్ల, నరసరావుపేట 3 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఇన్చార్జిల పదవులకు టిడిపి పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొన్నట్లు సమాచారం. కారణం చూస్తే వైయస్ జగన్ అమరావతి రాజధాని కి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడంతో రాబోయే ఎన్నికలలో…. కచ్చితంగా తమకు ఈ అంశం అనుకూలంగా మారుతుందని టిడిపి నేతలు భావిస్తున్నారట. ఇందుకోసం ఇప్పటి నుండే గుంటూరు జిల్లాలో తల పండిపోయిన సీనియర్ నాయకులు అదే విధంగా యువ నాయకులు పార్టీ ఎలాంటి పదవి ఇచ్చినా తీసుకోవడానికి తెగ ఆరాట పడుతున్నట్టు సమాచారం.