ఈటీవీ లోని ‘పటాస్’ షో తో బుల్లితెరపై తన ప్రస్థానం మొదలెట్టిన శ్రీముఖి తర్వాత ఒక్కసారిగా టెలివిజన్ ఇండస్ట్రీ లో టాప్ యాంకర్ గా ఎదిగింది. ప్రస్తుతం సుమ కనకాల తర్వాత అత్యధిక మొత్తం తీసుకుంటున్న యాంకర్ శ్రీముఖి కావడం విశేషం. ఇంకో రెండేళ్ళలో పెళ్ళి చేసుకుని ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతున్నానని శ్రీముఖి సంచలన కామెంట్స్ చేసింది.
ఈ బుల్లితెర రాములమ్మ తనకి కాబోయే వాడు ఎవడో కూడా అందరిముందు చెప్పేసింది. ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అంటూ అతనికి ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఇక ఇదంతా సుమ పోస్ట్ గా వ్యవహరించే ‘క్యాష్’ షో లో జరిగింది. ఈ షో కి సంబంధించిన వచ్చే వారం ఎపిసోడ్ లో గెటప్ శ్రీను, విష్ణుప్రియ, శ్రీముఖి గెస్ట్లుగా విచ్చేశారు. ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఢీ కంటెస్టెంట్ పండు బాగా పాపులర్ అయ్యాడు.
పలాసలో ని నక్కిలీసు గొలుసు పాటకి దుర్గారావు వేసిన స్టెప్పులను అనుకరిస్తూ లేడీ గెటప్ లో డ్యాన్స్ వేసిన పండు కి బాగా సూట్ అయ్యింది. ఇక ఆ తర్వాత పండు లేడీ గెటప్ లో పాటలు డాన్స్ వేయడం కామన్ అయిపోయింది ప్రజలు కూడా అతని సిగ్నేచర్ స్టెప్స్ ని బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు.
అయితే శ్రీముఖి తన మనస్సులో మాట బయట పెడుతూ మామూలుగా పండు ని పెళ్లి చేసుకుందామని అనుకున్నాను అని…. ఆ లేడీ గెటప్ వేసుకోపోతే మాత్రం అతని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. నువ్వు ఓకే అంటే పెళ్లి చేసుకుందాం అని ఏకంగా పండుని అడిగేసరికి ఆశ్చర్యపోవడం సుమ వంతు అయింది. ఈ సందర్భంలో ఒక ప్రశ్నకు సంబంధించిన కొన్ని ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అందులో తొమ్మిది నెలలు ఎందుకు లేవని శ్రీముఖి అడిగింది. దానికి పండు సెటైర్లు వేస్తూ అది మనం తర్వాత చూసుకుందాం అని అనేసాడు. దాంతో శ్రీముఖి ఒక్కసారిగా అవాక్కయ్యింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!