రాజధాని అమరావతి విషయంలో ప్రజలను వెన్నుపోటు వైయస్ జగన్ వెన్నుపోటు పొడిచారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అనే పుస్తకాన్ని టిడిపి పై ప్రచురించి…. అన్నీ అబద్ధాలు వాటిలో రాశారు అన్నట్టుగా నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. అసలు అమరావతి అనే పదాన్ని పలకటానికి వైయస్ జగన్ ఇష్టపడటం లేదని మండిపడ్డారు.
ఇదే తరుణంలో జగన్ అమరావతి రాజధాని గా చంద్రబాబు ఉ ప్రకటించిన తర్వాత తాడేపల్లిలో ఇంటి స్థలం కొన్నారు అని నిమ్మల రామానాయుడు గుర్తుచేశారు. అలా కొనడం నేరమైతే జగన్ ని కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తాడేపల్లి లో ఉన్న జగన్ ఇల్లు రమేష్ బాబు అనే వ్యక్తి పేరు పై రిజిస్ట్రేషన్ ఉందని ఆయన జగన్ కి చెందిన 25 కంపెనీల్లో బినామీ అని ఆరోపించారు.
జగన్ కి చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కు 1,600 ఎకరాలు కట్టబెట్టడం ఇన్ సైడ్ ట్రేడింగ్ లేకపోతే వన్ సైడ్ ట్రేడింగా అని ప్రశ్నించారు. అదేవిధంగా 108 వాహనాలు పేరుతో 300 కోట్లు విజయసాయిరెడ్డి కి కట్టబెట్టడం ఇన్సైడ్ ట్రేడింగ్ కాదా అంటూ ప్రశ్నించారు. అదేవిధంగా మద్యం దుకాణాల ద్వారా 20 వేల కోట్లు కొట్టేసిన జగన్….ఇన్ సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారా లేకపోతే వన్ సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారా అని ప్రశ్నించారు.