హైదరాబాదు, జనవరి 21: తెలంగాణలో సోమవారం జరిగిన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ తన హవా కొనసాగించింది. సోమవారం 12,202 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం 1038 గ్రామ పంచాయతీలు టిఆర్ఎస్ మద్దతుదారులు గెలిచినట్లు సమాచారం. 201 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దుతుదారులు, నాలుగు గ్రామ పంచాయతీల్లో తెలుగుదేశం మద్దతుదారులు, 12 గ్రామ పంచాయతీల్లో బిజెపి మద్దతుదారులు విజయం సాధించినట్లు తెలుస్తుంది.
previous post