టిడిపి హయాంలో దూకుడు గా వ్యవహరించిన జెసి కుటుంబానికి వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక బ్రేకులు పడ్డాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జేసీ బ్రదర్స్ వైయస్ జగన్ ని టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాగా ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి స్థానంలో ఉండటం తో… జేసీ బ్రదర్స్ అవినీతి వ్యాపారాలకు సంబంధించి బయటపడుతున్న కుట్రలు ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసుకుంటూ పోతున్నారు.
ఈ క్రమంలో వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ విషయంలో.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తనయుడు ఆశ్మిత్ రెడ్డి జైలు పాలయిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చిన కానీ… జేసీ ప్రభాకర్ రెడ్డి కరోనా నిబంధనలు ఉల్లంఘించి… పోలీసుల పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో మరిన్ని కేసులు నమోదయ్యాయి. దీంతో ట్రావెల్స్ వ్యాపారం చాలా వరకు దెబ్బతింది.
అదేవిధంగా జేసీ కుటుంబానికి సంబంధించి మైనింగ్ లీజులకి సంబంధించి లైసెన్స్ రద్దు చేయడం జరిగింది ప్రభుత్వం. దీంతో జేసీ కుటుంబం ఆర్థికంగా అనేక కష్టాలు ప్రస్తుతం ఎదుర్కొంటుంది. అదేవిధంగా రాజకీయంగా కూడా త్వరలో జేసీ కుటుంబానికి.. సరైన చెక్ పెట్టే తరహాలో… జగన్ సరికొత్త స్కెచ్ వేసి నట్లు..ఈ దెబ్బతో రాజకీయంగా కూడా జేసీ కుటుంబం కనుమరుగవడం గ్యారంటీ అనే టాక్ వినబడుతోంది. దీంతో అనంతపురం జిల్లా రాజకీయాలలో రాబోయే రోజుల్లో చేసి కుటుంబానికి కష్టాలు మరింతగా పెరిగే అవకాశముందన్న డిస్కషన్లు జరుగుతున్నాయి.