విశాఖ, మార్చి 17: విశాఖ వైసిపిలో అసమ్మతి రాజుకుంది. వైసిపి నేత వంశీకృష్ణ అనుచరులు వైసిపి ఎంపి ఎంవివి సత్యనారయణ కార్యాలయంపై దాడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు.
విశాఖ తూర్పు అసెంబ్లీ టికెట్ను భీమిలికి చెందిన విజయనిర్మలకు పార్టీ అధిష్టానం కేటాయించింది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్కు టికెట్ ఖరారు చేయకపోవడంతో ఆయన అనుచరులు రెచ్చిపోయారు. విజయనిర్మల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పలువురు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ నాయకుడిని ఇండిపెండెంట్గా పోటీ చేయించి విజయనిర్మలను ఓడిస్తామని పేర్కొంటున్నారు.
పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
వంశీకృష్ణ శ్రీనివాస్ 2014 ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు.