అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయంటూ విమర్శలు చేస్తూ వచ్చిన వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి తాజాగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ను టార్గెట్ చేశారు. ఆయనపై ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ప్రజాధనం దోపిడీలో జులుం ప్రదర్శించి కోడెల స్పీకర్ పదవికే కళంకం తెచ్చారని విజయసాయరెడ్డి అన్నారు.
ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల హెల్త్ స్కీమ్, ఫార్మసీ కౌన్సిల్ ఆఫీసును కనీస వసతులు కూడా లేని తన సొంత భవనంలో కోడెల పెట్టించారని విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చదరపు అడుగుకు 16రూపాయల అద్దె అయితే పైరవీ చేసుకుని చదరపు అడుగుకు 25రూపాయల చొప్పున తీసుకున్నారనీ, నాలుగున్నర కోట్ల రూపాయలకు పైగా లూటీ చేశారనీ విజయసాయిరెడ్డి అరోపించారు.