Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నాగాని ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంక్షేమ పథకాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అమలు చేస్తూ ఉన్నారు. కరోనా లాంటి కష్ట సమయంలో కూడా దేశంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలా వద్దా అని ఆలోచన చేస్తున్న సమయంలో కూడా జగన్ రాష్ట్రంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో వెనక్కి తగ్గకుండా ప్రతిదీ నెరవేరుస్తూ ముందుకు దూసుకుపోతున్నారు.
ఇలాంటి తరుణంలో ఇప్పటికే ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఆలోచనలు చేస్తున్న జగన్.. ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మేలు చేసే విషయంలో ఎక్కడా రాజీ పడని జగన్ ఇప్పుడు వారి ఆరోగ్య విషయంలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేటర్ లోకి వెళ్తే ఏపీ ప్రజల జీవన శైలి జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. మండలానికి ఒకటి చొప్పున 104 మొబైల్ క్లినిక్ను కేటాయించారు.
ఇందులో భాగంగా ఇంటింటి సర్వే ద్వారా మధుమేహ రోగులను గుర్తించడంతో పాటు వారికి ఉచితంగా మందులు అందిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో వైఎస్సార్ క్లినిక్ లు.. కూడా ఏర్పాటు చేయనున్నారు. అక్కడ ఇరవై నాలుగు గంటలు వైద్యులు అందుబాటులో ఉండే విధంగా.. జగన్ సర్కార్ ఆలోచన చేస్తూ ఉంది. అంత మాత్రమే కాక ప్రతి కుటుంబానికి సంబంధించి ఆరోగ్య వివరాలు .. మెయింటెన్ చేసే తరహాలో ఒక రికార్డు కూడా ఉండే విధానాన్ని జగన్ రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని అనుకుంటున్నట్లు టాక్. ఈ విధానం ప్రవేశ పెట్టడం ద్వారా పెద్దపెద్ద జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించి .. పెద్ద ఇబ్బంది కలగకుండా ప్రజలకు న్యాయం చేసిన వారమవుతాం అని జగన్ భావిస్తున్నట్లు ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు టాక్.