రేషన్ కార్డు అనేది పేదవాడికి తీరని కల అయిన నేపథ్యంలో దాన్ని సాకారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లోనే అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చేలా జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.ఇంతకు ముందే ఈ విధానాన్ని ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ ఇప్పుడు దానికి పూర్తిస్థాయి యంత్రాంగాన్ని సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఈ నెల ఆరవ తేదీ నుండి ఈ నూతన విధానం అమల్లోకి రానున్నది.
రేషన్ కార్డు లేని నేపథ్యంలో అనేకమంది పేదలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకోలేకపోతున్నారని స్పందన కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి రావడంతో ఆయన ఈ విషయంలో శ్రద్ధ చూపారు.కేవలం రేషన్ దుకాణాల్లో సబ్సిడీ ధరలకు నిత్యావసరాలు పొందడమే కాకుండా అనేక సంక్షేమ పథకాల్లో సైతం రేషన్ కార్డు నెంబరు పొందుపర్చటం తప్పనిసరి.కానీ రాష్ట్రంలో చాలా మందికి రేషన్ కార్డులు లేకపోవటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ముఖ్యమంత్రి గమనించారు.దీనిపై ఆయన ఆగమేఘాల మీద నిర్ణయం తీసుకుని అధికారులను పరుగులెత్తించారు. వెంటనే దరఖాస్తు చేసుకున్న ఐదు రోజులకే రేషన్ కార్డు జారీ చేసే విధానానికి రూపకల్పన జరిగింది.గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ విధాన౦ లో రేషన్ కార్డు పొందే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది.ఈ నిర్ణయం పట్ల ప్రజల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది.
అంతేకాకుండా రేషన్ డోర్ డెలివరీ కి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు మొదలెట్టింది.ఇందులో భాగంగా రేషన్ బియ్యాన్ని తెచ్చివడానికి వీలుగా సంచులను కూడా ప్రభుత్వమే సరఫరా చేయబోతోంది.ఇంట్లో ఉండే రేషన్ కార్డు దారుల సంఖ్యను బట్టి పది ,పదిహేను కిలోలు ఇవ్వడానికి వీలుగా సంవత్సరం మొత్తానికి సరిపడేటట్లు పన్నెండు సంచులను ప్రభుత్వం అందిస్తుంది.ఈ సంచుల తయారీకి ఒక్కొక్కదానికి ఇరవై అయిదు రూపాయల ఖర్చుకానుండగా దాన్ని కూడా ప్రభుత్వం భరించబోతోంది.ఇంతవరకు ఎన్నో సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం అమలు చేసినప్పటికీ రేషన కార్డుల విషయంలో చేపట్టబోతున్న చర్యలు ప్రజలను పూర్తిస్థాయిలో సంతృప్తి పరుస్తాయని చెప్పవచ్చు.