మార్కెట్లో ప్రస్తుతం స్మార్ట్ వాచ్లు, బ్యాండ్లకు గిరాకీ బాగా పెరిగింది. దీంతో పలు కంపెనీ ఆయా ప్రొడక్ట్స్ను తక్కువ ధరలకే తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే వాచ్ల తయారీదారు హువామీ కొత్తగా అమేజ్ఫిట్ బిప్ యు స్మార్ట్ వాచ్ను భారత్లో విడుదల చేసింది. ఈ వాచ్ చాలా తక్కువ ధర కలిగి ఉండడమే కాదు, పలు ఆకట్టుకునే ఫీచర్లు కూడా దీంట్లో లభిస్తున్నాయి.
అమేజ్ఫిట్ బిప్ యు స్మార్ట్ వాచ్లో 1.43 ఇంచుల టీఎఫ్టీ కలర్ డిస్ప్లేను ఇచ్చారు. దీనికి గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ లభిస్తుంది. డిస్ప్లే 320 x 302 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ను కలిగి ఉంటుంది. ఫోన్కు వచ్చే కాల్స్, మెసేజ్లు, ఈ-మెయిల్స్, వెదర్, ఇతర యాప్లకు చెందిన నోటిఫికేషన్లను వాచ్లో చూసుకోవచ్చు. రిమోట్ ఫోన్ కెమెరా కంట్రోల్గా కూడా వాచ్ పనిచేస్తుంది. స్టాప్వాచ్, వరల్డ్ క్లాక్, వెదర్ ఫోర్క్యాస్ట్ ఫీచర్లను ఇందులో పొందవచ్చు.
60 రకాలకు పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఈ వాచ్లో లభిస్తున్నాయి. హార్ట్ రేట్ను తెలుసుకునేందుకు ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్ను ఇచ్చారు. ఎస్పీఓ2 ను కూడా తెలుసుకోవచ్చు. స్ట్రెస్ మానిటరింగ్, బ్రీత్ ట్రెయినింగ్ ఫీచర్లను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 5.0 లేదా ఆపైన వెర్షన్, ఐఓఎస్ 10 లేదా ఆపైన వెర్షన్ ఉన్న ఫోన్లకు బ్లూటూత్ 5.0 ద్వారా ఈ వాచ్ కనెక్ట్ అవుతుంది. ఫోన్లో మ్యూజిక్ను వాచ్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు.
వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ను ఈ వాచ్కు అందిస్తున్నారు. 225 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది. 9 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. రూ.3,999 ధరకు ఈ వాచ్ లభిస్తోంది. అమెజాన్లో దీన్ని కొనవచ్చు. లాంచింగ్ సందర్భంగా ఈ వాచ్ను రూ.3499కే విక్రయిస్తున్నారు.