Breaking: నల్లగొండ జిల్లా నకిరేకల్లు సమీపంలో నర్సింగ్ కళాశాల బస్సు బొల్తా పడిన ఘటనలో 15 మంది విద్యార్ధినులు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా కేంద్రం నల్లగొండలో పరీక్ష రాసేందుకు నర్సింగ్ విద్యార్ధనులు కళాశాల బస్సులో వెళుతుండగా, తాటికల్ ప్లైఓవర్ వద్ద సర్వీస్ రోడ్డులోకి వెళుతున్న కళాశాల బస్సును వెనుక నుండి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో విద్యార్ధినులు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా కొట్టింది.
ఈ ఘటనలో పది మంది విద్యార్ధినులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరి కొందరు స్వల్ప గాయాలు అయ్యాయి. ఘటనా స్థలంలో విద్యార్ధినుల హాహాకారులు మిన్నంటాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన నకిరేకల్లు ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రధమ చికిత్స అనంతరం సూర్యాపేట, నల్లగొండ ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.