MIM Chief Asaduddin Owaisi: ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ పై కేసు నమోదు అయ్యింది. ఆయనపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మతసామరస్యానికి భంగం కల్గించారనీ, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారనీ, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రిపై అసత్య ఆరోపణలు చేశారని అభియోగాలతో అసదుద్దీన్ పై కేసు నమోదు చేశారు. యూపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం వంద స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో భాగంగా యూపీలో మూడు రోజుల పర్యటనలో ఉన్న ఒవైసీ గురువారం రాత్రి కాట్ర చందనలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై ఒవైసీ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. వంద సంవత్సరాల నాటి రామ్ సనేహి ఘాట్ మసీదును ధ్వంసం చేశారనీ, దాని శిధిలాలు కూడా తొలగించారంటూ ఒవైసీ ఆరోపించారు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఒవైసీపై బారబంకి నగర పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు పోలీసులు తెలిపారు. మతం ఆధారంగా శతృత్వాన్ని ప్రోత్సహించడం, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడం, ప్రభుత్వాధినేతలపై అసభ్యకమైన వ్యాఖ్యలు చేయడం వంటి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు బరాబంకి పోలీస్ సూపర్నిటెండెంట్ యమునా ప్రసాద్ తెలిపారు. తన ప్రసంగంలో ఒవైసీ వంద సంవత్సరాల నాటి రామ్ సనేహి ఘాట్ మసీదును ధ్వంసం చేశారంటూ వ్యాఖ్యానించారనీ, ఇది వాస్తవానికి విరుద్దమని ఆయన తెలిపారు. ర్యాలీలో కోవిడ్ నిబంధనలు పాటించలేదనీ, ప్రధాన మంత్రి మోడీ, ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ పై అనుచితమైన, నిరాధారమైన వ్యాఖ్యలు కూడా చేశారని ఆయన వెల్లడించారు.
Read More: Konda Surekha: హూజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో పోటీకి సిద్ధం కానీ.