Nikhat Zareen: మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండవ సారి బంగారు పతకం అందుకున్న తర్వాత తొలి సారిగా హైదరాబాద్ చేరుకోవడంతో ఆమెకు గ్రాండ్ వెల్కమ్ లభించింది. తెలంగాణ రాష్ట్ర కీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ కుటుంబ సభ్యులు శంషాబాద్ (రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు) విమానాశ్రయం లో ఘన స్వాగతం పలికారు. ఆదివాసీ సంప్రదాయ పద్దతిలో నృత్యాలు చేసి మరీ నిఖత్ కి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నిఖత్ జరీన్ మీడియాతో మాట్లాడుతూ .. అంతర్జాతీయ బాక్సింగ్ చాంపియన్ లో రెండో సారి బంగారు పతకం సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన గెలుపునకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసిఆర్, ఎమ్మెల్సీ కవితలకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళల అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో బాక్స్ నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించడంతో అమె పై ప్రశంసల వర్షం కురిసింది. ఆ సందర్భంగా సీఎం కేసిఆర్ సంతోషం వ్యక్తం చేస్తూ ఆమె కు శుభాకాంక్షలు తెలిపారు. భారత్ కు బంగారు పతకాన్ని అందించిన నిఖత్ జరీన్ తెలంగాణకు గర్వకారణమని సీఎం కేసిఆర్ అన్నారు. నిఖత్ జరీన్ తన వరుస విజయాలతో దేశ ఖ్యాతిని మరో సారి ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. క్రీడల అభివృద్ధి కి, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు కేసిఆర్.
కేబినెట్ విస్తరణపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు