Drunk and Driving Cases: మద్యం సేవించి వాహనాలు నడపరాదని, న్యూఇయర్ వేడుకల సమయంలో విస్తృతంగా తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తామని పోలీస్ అధికారులు హెచ్చరికలు జారీ చేసినా మందు బాబులు మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. యదేశ్చగా మద్యం సేవించి వాహనాలపై ప్రయాణించారు. పోలీసుల తనిఖీల్లో బాగానే చిక్కారు. న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి.
న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1200 కేసులు, సైబరాబాద్ కమిషరేట్ పరిధిలో 1241 కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలారు. ఇక, సైబరాబాద్ లో బ్రీత్ అనలైజరర్ కౌంటర్ 200 పాయింట్లు దాటిన వారు 151 మంది ఉన్నట్లు వెల్లడించారు. సైబరాబాద్ లో ఇద్దరు మహిళలతో పాటు తాగి వాహనాలు నడిపిన 1239ద మంది పై పోలీసులు కేసులు నమోదు చేశారు. తాగి డ్రైవింగ్ చేసిన కేసుల్లో 938 బైక్ లు, 21 ఆటోలు, 275 కార్లు, ఏడు భారీ వాహరనాలను స్వాధీనం చేసుకున్నారు. పలు చోట్ల పోలీసులతో వాహనదారులు వాగ్వివాదానికి దిగారు.
మరో వైపు నూతన సంవత్సరం సందర్భంగా మద్యం అమ్మకాల ద్వారా తెలంగాణ సర్కార్ కు భారీ ఆదాయం సమకూరింది. డిసెంబర్ 31వ తేదీ ఒక్క రోజే 19 ప్రభుత్వ డిపోల నుండి లక్షా 30వేల కేసుల లిక్కర్, లక్షా 35 వేల కేసుల బీరు అమ్మకాలు జరిగాయి. దీంతో, ఆదివారం ఒక్క రోజే ప్రభుత్వానికి రూ.125 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక, గడచిన మూడు రోజుల్లో తెలంగాణలో రూ.658 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
డిసెంబర్ 28న రూ.133 కోట్లు 29న రూ.179 కోట్లు, 31న అత్యధికంగా రూ.313 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. న్యూఇయర్ సందర్భంగా మందు బాబుల సౌలభ్యం కోసం అర్ధరాత్రి 12 గంటల వరకూ లిక్కర్ షాపులు, వైన్స్ కి అనుమతి ఇవ్వడం,, బార్ లకు ఒంటి గంట వరకూ అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Vidadala Rajini: వైసీపీ ఆఫీసుపై దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదు – మంత్రి రజిని