తెలంగాణ కొత్త సచివాలయ భవనంలో ప్రారంభానికి ముందే అపస్తృతి చోటుచేసుకుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నూతన సచివాలయ భవనం ప్రారంభానికి సిద్దమవుతోంది. హైదరాబాద్ కే తలమానికంగా సుమారు 20 ఎకరాల స్థలంలో గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు ఆరు అంతస్తుల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా దక్కన్, కాకతీయ శైలి ఉండేలా ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్ట్స్ నమూనాతో ఈ భవనాన్ని నిర్మించారు. 2020 జనవరి నాల్గవ తేదీ పనులను ప్రారంభించారు. దాదాపుగా పనులు అన్నీ పూర్తి కావడంతో సచివాలయ భవన ప్రారంభోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 17న దీని ప్రారంభోత్సవానికి సీఎం కేసిఆర్ ముహూర్తం ఖరారు చేయించారు.
ఈ తరుణంలో నూతన సచివాలయ భవనంలో వెనుక భాగంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయిదు, ఆరు అంతస్తుల్లో మంటలు అంటుకున్నాయి. సచివాలయం ప్రధాన గుమ్మటం పైన దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. వెంటనే అగ్ని మాపక శాఖ అధికారులు అప్రమత్తమైయ్యారు. 11 ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపు చేశారు. అగ్ని మాపక శాఖ డీజీ నాగిరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ లో షార్ట్ సర్క్యూట్ జరగడంతోనే అగ్నిప్రమాదం జరిగిందని అనుకుంటున్నారు. ఈ అగ్నిప్రమాద ఘటనకు గల కారణాలపై అధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. జరిగింది ప్రమాదం కాదనీ, కేవలం అది మాక్ డ్రిల్ అని చెబుతున్నారు. సెక్రటేరియట్ భద్రాత సిబ్బంది కూడా మాక్ డ్రిల్ అని పేర్కొంటున్నారు. పొగల ధాటికి సెక్రటేరియట్ వెనుక భాగంలోని ఓ గుమ్మటం నల్లగా మారింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.