IPS Transfers: తెలంగాణలో మరో సారి సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది. రాష్ట్రంలో 20 మంది సీనియర్ ఐపీఎస్ లు బదిలీ అయ్యారు. డీజీపీగా రవిగుప్తాకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతలు అప్పగించింది.
ఎన్నికల సమయం వరకూ డీజీపీగా పని చేసిన అంజనీ కుమార్ ను రోడ్డు భద్రతా విభాగం చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా బదిలీల ప్రకారం
- విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీగీ రాజీవ్ రతన్
- ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్
- రాష్ట్ర పోలీస్ అకాడమి డైరెక్టర్ గా అభిలాష బిస్త్
- జైళ్ల శాఖ డీజీగా రమేష్ నాయుడు
- సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ సంయుక్త కమిషనర్ గా సత్యనారాయణ
- హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా శరత్ చంద్ర పవార్
- ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ గా కమలాసన్ రెడ్డి
- టీసీపీఎఫ్ అదనపు డీజీగా అనిల్ కుమార్
- హోంగార్డ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర
- హైదరాబాద్ మల్టీ జోన్ 2 ఐజీ గా తరుణ్ జోషి
- హైదరాబాద్ మల్టీ జోన్ 1 ఐజీగా జోషికి అదనపు బాధ్యతలు
- ఏసీబీ డైరెక్టర్ గా ఏఆర్ శ్రీనివాస్
- ఐజీ పర్సనల్ గా చంద్రశేఖర్ రెడ్డి
- సీఐడీ అదనపు డీజీగా శిఖా గోయల్, సైబర్ సెక్యురిటీ బ్యూరో డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు
Green Channel: ఏపీ సీఎం వైఎస్ జగన్ చొరవతో హెలికాఫ్టర్ లో గుండె తరలింపు