Green Channel: ఏపీలో ఇవేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గుండె మార్పిడి శస్త్ర చికిత్స కోసం సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు విశాఖ నుండి తిరుపతికి గుండెను విమానంలో తరలించారు. ఇందు కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు.
ఏపీలో గుండె మార్పిడి శస్త్ర చికిత్స కోసం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. ముందుగా అవయవదాత గుండెను శ్రీకాకుళం నుండి విశాఖ కు హెలికాఫ్టర్ లో అక్కడ నుండి తిరుపతికి విమానంలో తరలింపు జరుగుతోంది. రాగోలు జెమ్స్ మెడికల్ కళాశాలలో అవయవదానంలో భాగంగా గుండెను తిరుపతికి తరలిస్తున్నారు.
గుండె శస్త్ర చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత వైద్య కళాశాల యాజమాన్యం సీఎంఓకు తెలియజేయగా, సీఎం జగన్ చొరవతో 20 నిమిషాల్లోనే విశాఖకు గుండెను అధికారులు తరలించారు. మరి కాసేపటిలో తిరుపతి విమానాశ్రయానికి గుండెను తరలించనున్నారు. ఇక తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయం నుండి గుండెను గ్రీన్ ఛానల్ ద్వారా పద్మావతి ఆసుపత్రికి తరలించనున్నారు.
Nirmala Sitharaman: ఏపీ సర్కార్ కు కేంద్రం గుడ్ న్యూస్