Nirmala Sitharaman: ఏపీ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేసినందుకు గానూ అదనంగా 0.5 శాతం రుణాలు పొందేందుకు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. విద్యుత్ సంస్కరణల్లో ప్రధానంగా మూడు అంశాలను అమల్లోకి తీసుకువచ్చినందుకు గానూ కేంద్రం ఈ అవకాశం కల్పించింది.
2021 -22 ఆర్ధిక సంవత్సరంలో 12 రాష్ట్రాలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాయి. తాజాగా ఏపీ సహా ఆరు రాష్ట్రాలకు ఈ అవకాశం దక్కింది. 15వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు మార్కెట్ నుండి అదనపు రుణాలు పొందేందుకు అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ ప్రకటించింది. ఈ వెసులుబాటు ద్వారా 2021 -22 లో ఏపీ ప్రభుత్వం 3,716 కోట్ల రుణం తీసుకుంది. తాజాగా కల్పించిన వెసులుబాటు తో రూ.5,858 కోట్ల రుణం తీసుకునేందుకు అవకాశం లభించింది.
ఏపీతో పాటు అస్సాం, కేరళ, రాజస్థాన్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు అదనపు రుణాలు పొందేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వివరాలు వెల్లడించారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ సిఫార్సులతో రాష్ట్రాలు మార్కెట్ నుండి అదనపు రుణాలు పొందే అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Based on the recommendation of Ministry of Power, Department of Expenditure @FinMinIndia allowed additional borrowing of 0.5% of GSDP linked to performance in power sector Rs. 39,175 to 12 States in FY2021-22 and Rs. 27,238 to 6 States in FY2022-23. #ViksitBharat… pic.twitter.com/Dcq0eOQu47
— Ministry of Finance (@FinMinIndia) December 19, 2023