Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ ముగిసింది. 105 రోజులపాటు నిరంతరంగా సాగిన ఈ షోలో మొత్తం 19 మంది పోటీ పడటం జరిగింది. కానీ చివరకు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ కైవాసం చేసుకున్నాడు. చివరివారం పోటీ చాలా రసవత్తరంగా సాగింది. టైటిల్ విషయంలో శివాజీ ఇంకా అమర్ పేర్లు కూడా గట్టిగా వినపడ్డాయి. అమర్ కోసమైతే చాలామంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు యాంకర్లు ఓటు వేయాలని సపోర్ట్ చేశారు. అయినా గాని ప్రశాంత్ గెలవడం జరిగింది. ఈ క్రమంలో బిగ్ బాస్ అయిన తర్వాత చాలామంది కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా హౌస్ లో విశేషాలు తెలియజేస్తున్నారు.
తాజాగా ఈ రీతిగానే అర్జున్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన అర్జున్.. ఫైనల్ వారం దాక చేరుకున్నాడు. టాప్ సిక్స్ లో నిలిచి.. చివరి వారంలో బయటకు వచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బయట ఎలా ఉన్నానో…. లోపల కూడా అదేవిధంగా ఉన్నాను. నేను ఎక్కడ సేఫ్ గేమ్ ఆడలేదు. ఎవరిని కూడా టార్గెట్ చేయలేదు. ఒంటరిగానే ఆడుకుంటూ వెళ్లిపోయా. హౌస్ లో ఫ్రెండ్షిప్ పెట్టుకుంటే కొన్ని సందర్భాల్లో ఎటు తేల్చుకోలేని పరిస్థితి నెలకొంటుంది. అందుకే నా ఆట నేను ఆడుతూ వెళ్ళిపోయా. నేను ఎవరి విషయంలో జోక్యం చేసుకోలేదు. అదే సమయంలో నా జోలికి వస్తే ఎవరిని వదల్లేదు. నామినేషన్ ప్రక్రియలు నా అభిప్రాయం మాత్రం చెప్పాను.
ఇక హౌస్ లో శివాజీతో నాకు గొడవ పడుతుందని అనుకున్నాను. కానీ అలాంటి సందర్భం రాలేదు ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు. యావర్ అద్భుతమైన గేమ్ ఆడాడు… అతనికి ప్లస్ పాయింట్ అతని ఆవేశం. ఇంకా పల్లవి ప్రశాంత్ అయితే గేమ్ ఆడుతూనే మరొకకు ఏడవటం అతని బలం. మరి దానిని సింపతి కోసం ఏడిచాడా లేకపోతే మామూలుగానే వచ్చిందా అనేది తెలియదు. శివాజీ అన్నది మేదస్సు బలం. హౌస్ లో ఏది చేసినా ప్రతీది గేమ్ లో భాగమే దానిని తప్పు అని చెప్పడానికి వీల్లేదు అంటూ అర్జున్ తనదైన శైలిలో వివరించారు.