KCR: కరోనా కల్లోలం కొనసాగుతున్న తరుణంతో తెలంగాణ సీఎం కేసీఆర్ గాంధీకి వెళ్లడం రోగులను పరామర్శించి వారిలో ధైర్యం నింపడం తెలిసిన సంగతే. దీంతో పాటుగా తెలంగాణలో మరో ముఖ్య నగరమైన వరంగల్ను నేడు ఆయన సందర్శించనున్నారు. ఇక్కడ చికిత్స గురించి ఆరా తీయనున్నారు. అయితే, ఈ పర్యటన కంటే ముందే కేసీఆర్కు ఊహించని షాక్ తగిలింది. ఓ పక్క కరోనాతో ప్రాణాలు పోతుంటో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో సిబ్బంది అరాచకాలు సాగిస్తున్నారు. హాస్పిటల్ లో రోగుల నుంచి భారీగా డబ్బులు గుంజేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో పోరాడుతుంటే దాన్ని అదనుగా భావించి సిబ్బంది అరాచకాలకు పాల్పడుతున్నారు.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం…
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లోని ఆక్సిజన్ ఫ్లోమీటర్లను సాక్షాత్తు ఆస్పత్రి సిబ్బంది చోరీ చేస్తున్నారు. అలా 700ల ఆక్సిజన్ ఫ్లో మీటర్లను దొంగిలించి మరోచోట అమ్ముకుంటున్న వైనం బయటపడింది. ఆక్సిజన్ ఫ్లో మీటర్లను హాస్పిటల్ సిబ్బంది అమ్ముతున్నారనే సమాచారంతో ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓ పక్క ప్రైవేటు హాస్పత్రులకు ఏమాత్రం తీసిపోకుండా ఎంజీఎంలో అన్ని రకాల వైద్యం సదుపాయాలు అందేలా ప్రభుత్వం తీసుకుంటుంటే..మరోపక్క హాస్పిటల్ సిబ్బంది మాత్రం చేతివాటం చూపిస్తూ రోగులకు అందాల్సి వైద్య సదుపాయాలను దొంగిలించి బయట అమ్ముకుంటున్నారు.
నచ్చకపోతే వెళ్లిపోండి…
ఎంజీఎం సిబ్బంది ఆక్సిజన్ ఫ్లో మీటర్లు దొంగిలించటమే కాకుండా ఆక్సిజన్ సిలిండర్లను మార్చుతు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆక్సిజన్ ఉన్న సిలిండర్లను తీసి వేసిన రోగులకు ఖాళీ సిలిండర్లను అమర్చుతున్నారు. అదేమని ప్రశ్నించి రోగులపైనా..వారి బంధువులపైనా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇక్కడ అంతే ఇష్టమైతే ఉండండీ లేకపోతే వెళ్లిపోండి అంటూ దురుసుగా సమాధానం చెబుతున్నారని రోగులు వాపోతున్నారు. మరి వీటిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో.