KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి కొత్త చర్చ. ఇంకా చెప్పాలంటే ఆయన రాజకీయ ఎత్తుగడల గురించి , ఎందుకు ఇప్పుడు సంయమనం పాటిస్తున్నారు లేదంటే… నాన్చుతున్నారు అనేది టీఆర్ఎస్ వర్గాలకే అంతుచిక్కడం లేదంట. ఇదంతా త్వరలోనే తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ పెద్దాయన వైఖరి గురించి. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు ప్రకటించినప్పటికీ కేసీఆర్ ఇంకా తమ అభ్యర్థుల విషయంలో పెండింగ్ మంత్రాన్నే జపిస్తున్నారు.
KCR ఏంటిది కేసీఆర్ సర్?
త్వరలో నల్గొండ-వరంగల్-ఖమ్మం, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. అభ్యర్థుల విషయంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో చర్చించి అధిష్టానానికి కొన్ని పేర్లను పంపగా కాంగ్రెస్ అధిష్టానం రెండు పేర్లను ఓకే చేసింది. నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి అభ్యర్థిగా రాములు నాయక్, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానానికి అభ్యర్థిగా జి. చిన్నారెడ్డి పేర్లను అధిష్టానం ఖరారు చేసింది . ఈ ఇద్దరి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఖరారు చేశారని.. పార్టీ జనరల్ సెక్రటరీ ముకుల్ వాస్నిక్ ఓ ప్రకటన విడుదల చేశారు.
కేసీఆర్ సర్ ఏం చేస్తున్నారంటే…
ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఇంకా తమ అభ్యర్థుల విషయంలో పెండింగ్ వైఖరిని అవలంభిస్తున్నారు. నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికి మరోసారి టీఆర్ఎస్ అవకాశం కల్పించారు. అది కూడా ఒకట్రెండు రోజుల క్రితమే. ఇంకా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. మరోవై