Nandamuri Balakrishna: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని మంత్రి ఛాంబర్ లో వీరు సమావేశమై 15 నిమిషాల పాటు చర్చించారు. హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రి చైర్మన్ గా బాలకృష్ణ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో మరింత ఎక్కువ మంది రోగులకు సేవలు అందించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన నాలుగో డే కేర్ యూనిట్ ను బాలకృష్ణ ప్రారంభించారు. ఆసుపత్రిలో ఇప్పటికే మూడు డే కేర్ యూనిట్ లు అందుబాటులో ఉండగా తాజాగా అందుబాటులోకి వచ్చిన సదుపాయంతో డే కేర్ చికిత్సకు 181 పడకలు అందుబాటులోకి వచ్చాయని ఆసుపత్రి వర్గాలు తెలిపారు.
Nandamuri Balakrishna: అత్యుత్తమ ఆసుపత్రి జాబితాలో బసవతారకం ఆసుపత్రి
ఆరోగ్య శ్రీ కింద సేవలు పొందుతున్న వారికి పడకలు ఇప్పటికే పెంచినట్లు బాలకృష్ణ వెల్లడించారు. బసవతారకం ఆసుపత్రిలోని సదుపాయాలను పరిశీలించిన నీతి ఆయోగ్ ..దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా గుర్తించినట్లు బాలకృష్ణ తెలిపారు. ఈ తరుణంలో నందమూరి బాలకృష్ణ మంత్రి హరీష్ రావుతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. మంత్రి హరీష్ రావుతో ఏ విషయాలపై చర్చించారు అనే విషయాలు ఇంకా బయటకు రాలేదు.
ఓ పక్క అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా, మరో పక్క నటుడుగా సినిమాల్లో నటిస్తూ, అటు బసవతారకం ఆసుపత్రికి చైర్మన్ గా బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. సినిమా షూటింగ్ ల ద్వారా బిజీగా ఉన్నప్పటికీ ఆసుపత్రిపై బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారనేది అందరికీ తెలిసిందే. వీలు దొరికిన సమయంలో తను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు బాలకృష్ణ.
Breaking: ఏపిలో నైట్ కర్ఫ్యూ..కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ కీలక ఆదేశాలు..!!