గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు నూతన సచివాలయంలో అవమానం జరిగింది. ఎమ్మెల్యే రాజాసింగ్ ను సచివాలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని ఆయనను వెనక్కు పంపడంపై ఆయన ఫైర్ అయ్యారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలిస్తేనే తాను వెళ్లినట్లు చెప్పారు. మీటింగ్ రావాలని అహ్వానిస్తే తాను సచివాలయానికి వెళ్లినట్లు చెప్పారు రాజాసింగ్. పోలీసులు తనను అడ్డుకుని తన పట్ల అవమానకరంగా వ్యవహరించారని అన్నారు.
దీనిపై తనకు మనస్థాపం కల్గిందన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టైంపాస్ కోసం మీటింగ్ పెట్టారా అని ఆయన ప్రశ్నించారు. సచివాలయంలోకి ఎమ్మెల్యేలకే అనుమతి లేకపోతే ఇంక ఎవరికి అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. నగరంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ సమావేశానికి హజరు కావాలని మంత్రి తలసాని మెసేజ్ పంపినా పోలీసులు అడ్డుకున్నారని ఆయన తెలిపారు.
Road Accident: శ్రీశైలం ఘాట్ రోడ్డులో టూరిస్ట్ బస్సు బోల్తా .. పది మందికి తీవ్ర గాయాలు